శుక్రవారం, ఫిబ్రవరి 03, 2012

కోస్తాలో కుల ‘కరివేకాపులు’!



కోస్తా జిల్లాల్లో రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం సందర్భంగా తెలంగాణ సమాజం స్పందించి  తీరు అభినందనీయంఅంబేద్కర్ పట్ల అతని విచారధార పట్ల తెలంగాణ ప్రజలకున్న అవగాహనకుఅతనిపట్ల ఉన్న గౌరవ భావానికి అది నిదర్శనంనిజానికి ఉద్యమాలు ప్రజల్లో అటువంటి భావజాల చైతన్యాన్ని కలిగిస్తాయితెలంగాణలో అంబేద్కర్ ఇప్పుడు కేవలం దళిత వాడలకే పరిమితం కాలేదుగడిచిన రెండేళ్ళలో ఆయన ఆలోచనా విధానాలు ఊరూరా విస్తరించాయిపల్లె పల్లెనా  ప్రతిధ్వనించాయి. తెలంగాణ ప్రజలకుముఖ్యంగా ఉద్యమంలో ఉన్నవారికి అంబేద్కర్ అత్యంత ప్రీతిపావూతుడుగా మారడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తాయిఅందులో మొదటిది ఆయన రాష్ట్రాల ఏర్పాటుపట్ల ప్రదర్శించిన స్పష్టమైన వైఖరిదేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది సామాజిక పునాదుల మీద జరగాలన్నది ఆయన ప్రతిపాదనల్లో మౌలికమైనదిఅందునా పీడిత వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లభించే విధంగా ఉండాలని ఆయన పలు సందర్భాలలో సూచించారు విషయం మీద ఆయన సుదీర్ఘమైన వాదనలు చేశారుభారత దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయనన్ని ప్రామాణిక ప్రతిపాదనలు చేశారుఆయన ప్రతిపాదనలే తెలంగాణవాదానికి కొత్త బలాన్నిచ్చాయిగడిచిన దశాబ్దకాలంలో తెలంగాణవాదం ఆయన చూపిన మార్గంలోనే తన వాదనకు పదును పెట్టింది

ఇక రెండోది ఆయన చూపిన చట్టబద్ధమైన పోరాటంఅది తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకత్వం చేసిందిఅంబేద్క ర్ సమకాలికులు చాలామందే స్వాతంత్ర సమరయోధులోదేశభక్తులో ఉండిఉండవచ్చుకానీ ఆయనకున్న సామాజిక నిబద్ధత ఉన్నవాళ్ళువివిధ సామాజిక సమస్యలపైన పోరాటాలు చేసిన వాళ్ళు అరుదుఆయన తన పోరాటంలో చట్టాలను ఎప్పుడూ ఉల్లంఘించకపోగా చట్టబద్ధమైనధర్మ బద్ధమైన సమాజం కావాలని తపించారుబ్రిటీష్ ప్రభుత్వానికి భారతీయ సామాజిక వ్యవస్థ మౌలి  స్వరూపాన్ని అర్థం చేయించి తదనుగుణ విధానాలు రూపొందించి ఇచ్చారుఅలాగే భారత ప్రభుత్వం కూడా అటువంటి చట్టబద్ధపాలన అందించాలని కలలుగన్నారుఆయన ఒక్క కులం గురించే కాదుకులంతో పాటు మతప్రాంతలింగ వివక్షల ను వ్యతిరేకించారువివక్షదోపిడీఅణచివేతఆధిపత్యం  రూపాల్లో ఉన్నా విముక్తిపొందే హక్కు అవకాశాలు ఉండాలనిఅది పోరాడి అయి నా సరే.. పొందే శక్తి ప్రతి వ్యక్తికీసామాజిక వర్గానికి ఉండాలని కోరుకున్నారుఅంతేకాదు  హక్కులను రాజ్యాంగబద్ధం చేశారు
 రాజ్యాంగ బద్ధమైన హక్కు కోసమే తెలంగాణ ప్రజానీకం చట్టబద్ధమైన సుదీర్ఘ పోరాటాన్ని చేస్తున్నారుకాబట్టే అంబేద్కర్ అంటే అంతటి గౌరవం తెలంగా  అంతటా వ్యక్తమయ్యింది .  గౌరవంతోనే తెలంగాణవాదులు అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారుఇది కచ్చితంగా అభినందించదగ్గ విషయమేకులతత్వం వైరస్ కంటే ప్రమాదకరంకోస్తాలో మొదలైన  విద్వేషం తెలంగాణ ప్రాంతానికి కూడా విస్తరిస్తున్నదికాకతాళీయమే కావచ్చు కాని కాం గ్రెస్ పాత కాపు డి.శ్రీనివాస్ సొంత ఊరిలో ఇది వెలుగుచూడడం కలవరపరుస్తున్నదికానీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఆయన విగ్రహాలను ఒక పధ్ధతి ప్రకారం రోజుకొక చోట కూలగొడుతున్నారుఅలాగని  ధ్వంస రచనను మొత్తం ప్రాంతానికి ఆపాదించలేం

ఆంధ్రాలోనే  అంబేద్కర్ వాదులు  ఆయన పోరాట వారసులు ఎక్కువఅంబేద్కర్ స్వయంగా ఉద్యమాలు నడిపిన కాలంనుంచి ఇప్పటి వరకు ఆయనను పూజ్యనీయంగా ఆరాధిస్తూ అనుసరించే వాళ్ళు అనేకమంది అక్కడ ఉన్నారుదేశంలోనే మొదటిసారిగా అక్కడి దళితులు తమ జీవితాలకు అంబేద్కర్ సిద్ధాంతాన్ని అన్వయించుకున్నారుతమ పోరాటాలకు ఆయనను ఆదర్శంగా తీసుకుని తాము తిన్నా తినకపోయినా ఒక్కో పైసా పోగుచేసుకుని తమవాడల్లోవీధు ల్లో ఆయన ప్రతిమలను నిలబెట్టుకున్నారుఆయన చూపిన మార్గంలో నడిచివచ్చిన తొలితరమే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ పోరాటాల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చింది విలువలు ఆచరించేవాళ్ళు కాబట్టే ఆంధ్రా దళి  బలహీన వర్గాలు తెలంగాణ ఉద్యమానికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నారువిగ్రహాల విధ్వంసం అక్కడి అగ్రవర్ణాల కుట్ర అని కొందరు అం టున్నారుఅది కూడా నిజం కాదుకూలగొట్టిన వాళ్ళుకుట్ర పన్నిన వాళ్ళు అగ్రవర్ణం వాళ్ళే అయి ఉండవచ్చుకానీ  నేరాన్ని అందరిమీదా తోసేయలేముఇది అర్థమయ్యే దళితులు దాన్నొక కులాల ఘర్షణగా మార్చకుండా సంయమనంతో ఉన్నారు.

ఆంధ్రా అగ్రవర్ణాల్లో కూడా మొదటినుంచి ఆదర్శాల కోసంసామాజిక న్యాయంకోసం నడుంకట్టిన సంస్కర్తలు ఎందరో వచ్చారుగురజాడ అప్పారావుత్రిపురనేని రామస్వామి చౌదరిరఘుపతి వెంకటరత్నం నాయుడుకందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంస్కర్తలు అగ్ర కులాల నుంచి వచ్చినప్పటికీ ఆంధ్ర సమాజాన్ని మానవీకరించే ప్రయత్నం చేశారుతమ కులాల్లోని దురాచారాలతో పాటుసామాజిక దుర్మార్గాలను రూపుమాపేందుకు ఆజన్మాంతం కృషి చేశారుఇది కేవలం ఒక రాజకీయ కుట్ర తప్ప మరోటి కాదు కుట్ర టార్గెట్ 2014. అప్పటిదాకా తెలంగాణ తేల్చకపోతే ఇక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని కాంగ్రెస్కు తెలుసురాష్ట్ర విభజన జరిగినా జరగకపోయినా సీమాంవూధలో కాంగ్రెస్ను నమ్మేవారు కరువవుతున్నారుఅక్కడ ఇప్పుడు అంతో ఇంతో వై.ఎస్.జగన్ హవా నడుస్తోం దిజగన్ పార్టీ పెట్టిజనాన్ని ఓదారుస్తూ వెళ్తున్న క్రమంలో సీమాంవూధలో కొందరు కాంగ్రెస్ శాసనసభ్యులువారిలో ప్రముఖంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆయన వైపు మొగ్గుచూపారుఅదే బాటలో కొం దరు దళితులుక్రిస్టియన్లు కూడా వెళ్లారుజగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో  రెండు కులాల నుంచే ఎక్కువ మద్దతు లభిస్తోందిఇది సామాజిక ఓటు బ్యాంకు కాబట్టి అంత తేలిగ్గా చెక్కు చెదిరే అవకాశంలేదని కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయిందిఇప్పటికే జగన్ వర్గం కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వా సం ప్రకటించి కూల్చే ప్రయత్నం చేసిందిఇది ముందుగానే పసిగట్టిన కాం గ్రెస్ పార్టీ చిరంజీవిని అక్కున చేర్చుకుంది.

అలాగే బొత్స సత్యనారాయణ కు పీసీసీ పగ్గాలు అప్పగించి మంత్రిగా కూడా కొనసాగిస్తోందిఇప్పుడు బొత్స ముఖ్యమంవూతి కంటే ముఖ్యుడైపోయారుమంత్రివర్గ విస్తరణ విషయంలో అసలు ముఖ్యమంత్రి అభ్యర్థనను పెడచెవిన పెట్టిన అధిష్ఠానం బొత్సకు తలొగ్గి కొత్తగా ఇద్దరు కాపులను కేబినేట్లోకి తీసుకోవడం ఒక ఎత్తయితేశంకర్రావును తొలగించడం దళితుల్లో కొందరికి పుండుమీద కారం చల్లినట్టయిందిఇవన్నీ గమనించే అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఏకంగా ఆజాద్ మీదే విరుచుకుపడ్డారుహర్షకుమార్ ఢిల్లీకి దగ్గరివాడుహస్తిన అండతో గతంలో రాజశేఖర్డ్డినే ఎదిరించినవాడుఅతన్ని ధిక్కరించి టికెట్ తెచ్చుకున్నవాడు కుల చిచ్చును రాజేసి రగిలిస్తున్నది ఢిల్లీ ఏజెంటుగా ఉన్న ఆజాదే ఆన్న సంగతి అతనికి తెలిసే కుండబద్దలు కొట్టా డుహర్షకుమార్ మాటల ప్రకారం కాపులను కాంగ్రెస్ పార్టీ తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోంది.
సాధారణంగా రాజకీయాల్లో ఇలాంటి ఉద్రిక్తతలే కొత్త సమీకరణాలను ముందుకు తెస్తాయిఇప్పుడు హర్షకుమార్ విమర్శలకు నేరుగా సమాధానం చెప్పలేని వాళ్ళే అంబేద్కర్ విగ్రహాల మీదపడ్డారు

సామాజిక వ్యవస్థలు బలహీనపడిపో యిపౌరసమాజం రాజకీయ ఛట్రంలో చిక్కుకుపోయినప్పుడు  సమాజానికైనా  చిక్కులు తప్పవుఇప్పుడు ఆంధ్రాలో అదే జరుగుతోందిముందే చెప్పినట్టు ఇది సామాజిక నేరం కాదురాజకీయ నాయకులు రాజేసిన చిచ్చుప్రభుత్వం చెప్తున్నట్టు విగ్రహాల ధ్వంసం నలుగురు తప్పతాగి చేసిన తప్పిదం కానే కాదుముమ్మాటికీ దళితుల మీద ఆధిపత్యం చేసేందుకు ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు స్వార్థపరులు చేసిన కుట్ర అని దళిత సంఘాలు అంటున్నాయిదాడుల మూలాలు బహిరంగంగానే కనిపిస్తున్నా మన మీడియాపాలక వర్గాలు  తతంగాన్ని గుర్తుతెలియని దుండగుల చర్యగా కొద్దిరోజులు ప్రచారం చేసి చిట్టచివరికి తాగుబోతుల తుంటరి పనిగా తేల్చేశారు.

మన రాష్ట్రాన్ని మద్యం వ్యాపారులే పరిపాలిస్తున్నందున మద్య సంబంధమైన నేరాలకు పెద్దగా శిక్షలుండవుకాంగ్రెస్ పార్టీ  కులచిచ్చు ద్వారా కోస్తాలో కాస్తో కూస్తో బలంగా ఉన్న కాపులను మచ్చిక చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది ప్రయత్నంలో భాగంగానే పోయిన ఎన్నికల్లో కూరకు కొరగాని చిరంజీవిని ఇప్పుడు కరివేపాకుగా మార్చుకుందిచిరంజీవికి గ్లామర్ ఉందికానీ పాపం రాజకీయ గ్రామరే లేదురాజకీయ ఎత్తుగడల్లో నూరేళ్ళ పైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిరంజీవి సామాజిక వర్గం మీద పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోందిచిరు బ్రాండ్ కరివేపాకుతో కొత్త ఘుమఘుమలు తీసుకురావాలని చూస్తోంది ఎత్తుగడను రెండుకళ్ళతో గమనిస్తోన్న చంద్రబాబు నాయు డు కూడా కుల పురాణం మొదలుపెట్టాడుస్వయంగా కమ్మ సాంప్రదాయ ఓట్లను సమీకరించుకునేందుకు తన వియ్యంకుడు బాలకృష్ణను బరిలోకి దించాడుఆయన  పనిలో ఉండగానే చంద్రబాబు స్వయం గా కాపులకు కరివేపాకు సంగతి గుర్తు చేశారుచాలాకాలం ఆధునికుడిగాహైటెక్ పొలిటీషియన్గా పేరున్న చంద్రబాబు కూడా ఇప్పుడు కులమే బలమని నమ్ముకుని కాపులకు కాకా పడుతున్నాడుసంఖ్యా బలంస్థానిక ఆధిపత్యం ఉం డి కూడా ఆంధ్రా రాజకీయాల్లో ఇప్పటివరకు సంఘటితశక్తిగా ఎదగనిది ఒక్క కాపులే.

వందేళ్ళకు పైగా ప్రయత్నించినా  కులం నుంచి ఇప్పటికీ రాష్ట్రస్థాయిలో రాజకీయాలు శాసించే నాయకుపూవరూ రాలేకపోయారువంగవీటి మోహనరంగారావు  ప్రయత్నం చేసినా అది సైద్ధాంతిక పునాది లేకపోవడం వల్ల నిలబడలేకపోయిందిచిరంజీవి కూడా అదే ప్రయత్నం చేశారుసామాజిక న్యాయం పేరుతో అత్యంత గంభీరమైన సిద్ధాంత పునాదిని ప్రతిపాదించి దానిమీద ఒక గాలిమేడను నిర్మించే ప్రయత్నం చేశారుకానీ అది పేకమేడై కుప్పకూలిందిఇప్పుడు  శిథిలాల మీద కాంగ్రెస్ ఒక కొత్త సౌధాన్ని నిర్మించాలని అనుకుంటున్నది.
సాధారణంగా చదువుసాంకేతికతఆర్థికాభివృద్ధిమనుషుల్ని సమాజాన్ని ఆధునీకరిస్తాయనిఆధునికత ఉదార విలువలనులౌకిక ధోరణిని పెంపొందిస్తుందని విలువ లు కుల మతాలు,సనాతన విలువలు అంతరిస్తాయని వాటి స్థానంలో చట్టంన్యాయంరాజ్యాంగం పట్ల గౌరవభావంప్రజాస్వామిక విలువలు అంకురిస్తాయని సామాజిక పండితులు అంటారుకానీ చదువుసంపదఅభివృద్ధిని సొంతం చేసుకున్న ఆధునిక సమాజంగా పేరున్న ఆంధ్రాలో కొందరిలో సంకుచిత ధోరణి కనిపించడం ఆందోళన కలిగించే పరిణామంతెలంగాణ విషయంలో కనిపించిన సంకుచిత ధోరణే అంబేద్కర్ విషయంలో కూడా చూడవచ్చు

విగ్రహాలు కూలగొట్టడం కంటే సంఘటనలకు సరై  రీతిలో అక్కడి పౌర సమాజం స్పందించకపోవడం ఇప్పుడు కలవరపరిచే విషయం.ఇదే మాట సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒక అధ్యాపక మిత్రుడితో అన్నానుఆయన హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడుఇక్కడే చదువుకున్నాడుఏది ఏమైనా తాను మాత్రం సమైక్యవాదినని పదే పదే చెప్పేవాడుఅన్నదమ్ముల్లా కలిసి ఉండాలని వాదిస్తుండేవాడునా ప్రశ్నకు ఆయన తీవ్రంగా స్పందించాడు. ‘ట్యాంక్ బండ్ మీది విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు తెలంగాణ పౌర సమాజం ఎందుకు స్పందించలేదు’ అని ఎదు రు ప్రశ్నించాడుప్రభుత్వం ప్రజల సొమ్ముతో ట్యాంక్బండ్ మీద విగ్రహాలు పెట్టిందిఅంబేద్కర్ విగ్రహాలు దళితుల సొత్తుఇక్కడ తెలంగాణ విగ్రహాలు లేకపోవడం ఒక సంస్కృతిక వివక్షఏర్పాటు చేయాలన్నది ఉద్యమం ముందుకు తెచ్చిన ఒక న్యాయమైన రాజకీయ డిమాండుమిలియన్ మార్చ్ను అడ్డుకుని అణచివేసిన ఆగ్రహంలో కూల్చివేత జరిగిందిఅంతటి ఆగ్రహంలో కూడా సామాజిక స్పృహ కనిపిస్తోంది.
శ్రీ శ్రీగుర్రం జాషువాపోతులూరి వీరవూబహ్మంవేమనమొల్ల ఇలా అనేక విగ్రహాలను ఆందోళనకారులు కాపాడుకున్నారు

కోస్తాలో జరిగింది అప్పటికప్పుడు ఆవేశంలో జరిగింది కాదుఒక పథకం ప్రకారం రెండుమూడు రోజుల పాటు జరిగిన విధ్వంసంట్యాంక్బండ్ విధ్వంసాన్ని కర్కటమర్కటముష్కర మూకల పనిగా ప్రచారం చేసిన తెలుగు మీడియాఅంబేద్కర్ విగ్రహాల విషయంలో అంటీముట్టనట్టు ఉండడం ఆశ్చర్యంవిగ్రహాలు ఏవైనా విధ్వంసం ఒక పాపమని ప్రవచించిన ఆంధ్రా పండితులు అక్కడి పాపానికి పరిహారం చేసుకోకపోగా కులాల మధ్య అనైక్యతను తలవంచుకుని ఆమోదించడం సంకుచిత వాదంసమైక్య వాదాన్ని కొత్తగా తామే కనిపెట్టినట్టుఅదే ప్రాణ వాయువన్నట్టు ప్రచారం చేస్తున్న వాళ్ళు ముందుగా అక్కడ సామాజిక సమైక్యత సాధిస్తే.. ఒక్క వాళ్ళకే కాదు మొత్తం సమాజానికి మంచిదిసామాజికంగా సక్యత లేనప్పుడు ఇంకే సమైక్యతా నిలబడదుఅంబేద్కరే చెప్పినట్టు ‘కులం పునాదుల మీద నిలబడి మాట్లాడేవాళ్ళు జాతిని నిర్మించలేరునిలబెట్టలేరు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి