శుక్రవారం, ఫిబ్రవరి 22, 2013

బాలచంద్రునికి బాసట కాలేమా ...!






బుద్ధుడు యుద్ధమే వద్దన్నాడు. యుద్ధ కాలంలో బతికి ఉన్నవారికి బాసటగా ఉండాలన్నాడు. పోరాడాలన్న తలంపు వీడి మనసునిండా దయను నింపుకోమన్నాడు. కానీ బుద్ధుని బోధనలకు నిలయం గా చెప్పుకునే శ్రీలంక ఇప్పుడొక రాక్షస రాజ్యంగా కనిపిస్తున్నది. దయ నిండి ఉండవలసిన అక్కడి మనుషుల హృదయాలు ఇప్పుడు క్రూరత్వంతో నిండిపోయి ఉన్నాయి. గడిచిన మూడు నాలుగేళ్ళుగా వస్తున్న వార్తలు వింటుంటే అదొక బౌద్ధ క్షేత్రంగా కాక యుద్ధోన్మాద క్షేత్రంగా మాత్రమే కనిపిస్తున్నది. నిజానికి దాన్ని యుద్ధమని కూడా అనలేం. నా దృష్టిలో అదొక జాత్యాహంకార హంతక క్రీడ. కాకపోతే పసి పిల్లలను పనిగట్టుకుని వేటాడడం ఏమిటి? 

బ్రిటన్‌కు చెందిన చానెల్ 4 అనే టెలివిజన్ నెట్‌వర్క్ శ్రీలంకలో సాగుతున్న నరమేధాన్ని నాలుగు భాగాలుగా ఇప్పటికే ప్రసారం చేసిం ది. తాజాగా ఈలం పోరాట రూపశిల్పి వేలుపిళ్లై ప్రభాకరన్ కుమారుడు పన్నెండేళ్ళ బాలచంవూదన్ ప్రభాకరన్‌ను చంపిన తీరు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దృశ్యాలు మనసున్న ప్రతివారినీ కలచివేశాయి. ఇంతకాలం శ్రీలంక పాలకుల క్రూరత్వాన్ని సమర్థిస్తూ వస్తున్న భారత ప్రభుత్వముసుగును ఈ వాస్తవాలు తొలగించనున్నాయి. 


బాల చంద్రన్ యుద్ధరంగంలో ఉన్న సైనికుడు కాదు. ఎవరికీ హాని తలపెట్టినవాడు కాదు. కేవలం ప్రభాకరన్ కొడుకు కావడమే ఆ బాలుడు చేసుకున్న నేరం. ఆ లంక గడ్డ మీద ఒక తమిళుడుగా పుట్టడమే ఆ పసివా డు చేసుకున్న పాపం. ఆ పాపానికి పసివాడని కూడా చూడకుండా శ్రీలంక సైన్యం అతని ప్రాణాలు తీసింది. మామూలుగా కాదు పర మ కిరాతకంగా కాల్చి చంపింది. కాల్పులు జరపడానికి వీలులేని, యుద్ధరహిత ప్రాంతం ‘నో-వార్ జోన్’లో ఉన్న బాలచంవూదన్‌కు తినడానికి బిస్కట్లు ఇచ్చి మచ్చిక చేసుకుని మరీ చంపి పారేసింది. ఇది అమానుషం. శ్రీలంకలో యుద్ధం జరుగుతున్నదని చెప్తూ వస్తున్న అక్కడి ప్రభుత్వం కనీసం యుద్ధనీతిని కూడా పాటించలేదు. అసలు చంపడానికి వీలుకూడాలేని సందర్భం ఇది. ఇది మానవత్వం గురించి, హక్కుల గురించి మరీ ముఖ్యంగా ఒక ప్రాంతపు ప్రజ లు తమ అధికారాల గురించి పోరాడడం న్యాయం అని నమ్మే ఎవరూ హర్షించని, సమర్థించలేని సందర్భం. ఇప్పుడు ఈ హత్యా వెలు గు చూసి న తరువాత శ్రీలంక ప్రభుత్వాన్ని క్షమించడానికి కూడా వీలులేదు. 


శ్రీలంక చేసిన హత్యల్లో ఇది మొదటిది కాదు చివరిది అంతకంటే కాదు.12 రోజుల పసిపాపలు మొదలు పండు ముదుసలి తమిళజాతిలో ఒక్క ప్రాణి కూడా మిగల కూడదన్నది శ్రీలంక తీసుకున్న శపథం. అందు కే 2008-09 మధ్య తమిళులు నివసించే జాఫ్నా పరిసరాలను శ్రీలంక ముట్టడించి యావత్ జాతిని మట్టుపెట్టే పనికి పూనుకుంది. లంక నరమేథంలో ఇప్పటికే లక్షలాదిమంది చనిపోయారని, మరికొన్ని లక్షలమంది అక్కడి సైనికుల చేతుల్లో బందీలుగా ఉన్నారని మానవహక్కుల సంఘాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు పేర్కొంటున్నాయి. ఇంత జరుగుతుంటే భారతదేశం మాత్రం మౌనంగా చూస్తున్నది.పన్నెండేళ్ళుగా భారత్ మౌనముద్ర తమిళజాతి హననానికి ఆమోద ముద్ర వేసింది. 


శ్రీలంక అతివూపాచీన బౌద్ధ సమాజాల్లో ఒకటి. క్రీస్తు పూర్వమే అశోక చక్రవర్తి కుమారుడు అరహత్ మహేంద్ర, కూతురు సంఘమిత్ర అక్కడ బౌద్ధానికి బీజం వేశారు. బుద్ధ గయ నుంచి తీసుకెళ్ళిన బోధి వృక్షాన్ని అక్కడ నాటి వచ్చారు. శ్రీలంక శాంతి కపోతమై విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. అప్పటి నుంచి శ్రీలంక అధికారికంగా ఒక బౌద్ధ దేశంగా ఉన్నది. కానీ బుద్ధుడి సందేశాన్ని మరిచింది. అశోకుడు త్యజించిన యు ద్ధాన్ని ఇప్పుడు లంక తలకెత్తుకున్నది. శ్రీలంక నరమేధాన్ని యుద్ధమని అనడానికి కూడా వీలులేదు. అది ఒక జాతిని నిర్మూలించే కుట్ర. లంక గడ్డమీద తమిళుల ఆనవాళ్ళు లేకుండా చేసే హత్యాకాండ. ఇది బౌద్ధానికి విరుద్ధం.ఈ సంఘటనల తరువాత అహింస బోధించిన బుద్ధుని అనుయాయులు సిగ్గుతో తలవంచుకోవాలి.శ్రీలంకను తమ మతం నుంచి వెలివేయాలి. 


కేవలం మతం నుంచే కాదు. హంతకుణ్ణి సభ్యసమాజం నుం చి వేలివేయాలని బౌద్ధం చెపుతోంది. బుద్ధుడు అహింసా సిద్ధాంతకర్త. ఆయన ప్రతిపాదించిన ప్రతిమోక్షాలలో హత్యలు ఒకటి. బుద్ధుడిగా మారాలనుకునేవాడు, బౌద్ధాన్ని ఆచరించేవాడు హత్యలకు దూరంగా ఉండాలి. చావడం చంపడం బౌద్ధం దృష్టిలో క్షమార్హం కాని నేరాలు. ‘బౌద్ధం ఆచరిస్తున్న వ్యక్తి ఎవరినైనా హత్యా చేసినా, హత్యకు ప్రేరేపించినా, సహకరించినా, సాయుధ సంపత్తి సమకూర్చినా, హత్యలను కీర్తించినా, హత్యలను చూసినా, మిన్నకుండినా, హత్యలను ఆమోదించినా, ఇతరుల చావుకు కారణం, సందర్భం, వాహకమైనా... అతడిని బౌద్ధం నుంచి వేలివేయాలని’ బుద్ధుడు పేర్కొన్నాడు. శ్రీలంకలో సాగుతున్న ఊచకోత అక్కడి రాజ్యం చేస్తున్న అరాచకం. కాబట్టి శ్రీలంకకు బుద్ధుడి పెరేత్తే అర్హతలేదు. దీనిపై బౌద్ధ పండితులు ముఖ్యంగా చైనా నియంతృత్వం మీద దండె త్తే దలైలామా నోరు విప్పాలి. 


ఇక రెండోది, భారత ప్రభుత్వం శ్రీలంక మీద చర్యలకు పూనుకోవాలి. కనీసం ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని విరమించుకుని ఆంక్షలు విధించాలి. సాధారణంగా జాతి నిర్మూలనకు పాల్పడే దేశాలు, హింసను ప్రేరేపించే దేశాలను వెలివేయడం, ఆంక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం దౌత్యనీతి. అది ఏ దేశమైనా ఇంకొక దేశం మీద చేయవచ్చు. కానీ భారత ప్రభుత్వం మాత్రం శ్రీలంక విషయంలో ఆ సాహసం చేయడం లేదు. అక్క డ సైన్యం చంపుతున్నది భారతీయ సంతతిని. తమిళులను. అయినా ప్రభు త్వం స్పందించక పోగా సహకరిస్తున్నది. 


అక్కడి పాలకులు తమిళులను ఏ ఒక్కరోజు కూడా మనుషులుగా గుర్తించలేదు. శ్రీలంక లో తమిళులు ఒక నాడు పాలకులు. ఆ దేశాన్ని తమిళ రాజులు ఏలారు. అక్కడి తమిళ మూలాలు పాండ్య, చోళసామ్రాజ్యాలలో ఉన్నాయి. క్రమంగా బ్రిటీష్ వలసపాలన నాటికి వారు అక్కడి తేయాకు తోటల్లో కూలీలు అయిపొయారు. తమిళ నాడు నుంచి దాదాపు పదిలక్షల మందికి పైగా ఆ తోటల్లో పనిచేసేందుకు వలస వెళ్ళారు.  బ్రిటీష్ పాలకులు భారత దేశం లో లాగే అక్కడ కూడా విభజించి పాలించడం మొదలు పెట్టారు. కమ్యూనల్ అవార్డ్జా అని, ప్రత్యేక ప్రాధాన్యత అని తమిళ జాతిని మభ్య పెట్టారు.  1948 లో స్వాతంత్రం తమిలులను పూర్తిగా పరాయి వాళ్ళను చేసింది. సింహళ జాతి ఆధిపత్యం అధికారం రెండింటినీ కైవసం చేసుకుంది. అప్పటినుంచి తమిళుల కష్టాలు మొదలయ్యాయి. మొదట సిలోన్ పౌరసత్వ చట్టం ఆ తరువాత సింహళ ఓన్లీ యాక్ట్ పేరుతో తమిళులకు పౌరసత్వం, పౌరహక్కులు లేకుండా చేసారు. తమిళుల అస్తిత్వం కోసం పోరాడుతున్న నాయకులను జైళ్లలో తోసి రాజకీయ పార్టీలను రద్దు చెసారు. అనధికారికంగా నివసిస్తున్నారంటూ తమిళ ప్రజలమీద, గ్రామాల మీద దాడులు చేసి శ్రీలంక  నుంచి తరిమికొట్టారు. ఇదంతా 1970 లోపు జరిగిన కథ.  

చరిత్ర పొడుగునా అనేక సందర్భాల్లో శ్రీలంక తమిళులకు అన్యాయం చేసిన భారత్ ఇప్పుడు తన మౌనంతో మరో చారివూతక తప్పిదానికి ఒడిగడుతోంది. దశాబ్దాల పాటు శ్రీలంక తమిళులు తమ అస్తిత్వం, అధికారాల కోసం అన్నిరకాల ప్రజాస్వామ్య పద్ధతు ల్లో పోరాడారు. జాతీయ అంతర్జాతీయ వేదికల్లో సమ సమస్యలను నివేదించారు. శ్రీలంక ప్రభుత్వం తమను రెండో శ్రేణి పౌరులుగా చూస్తూ, కనీస సౌకర్యాలు కల్పించక వేధిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పలు ఆందోళనలు చేశారు. కొన్ని సాధించుకున్నారు. కొన్నిచోట్ల విఫలం అయ్యారు. అనేకమంది ఆత్మాహుతులకు పాల్పడ్డారు. చివరకు ఆత్మాహుతి దళాలుగా మారారు. మానవ బాంబులై  పేలి పొయారు. 

అనేక శాంతియుత ప్రజాస్వామిక పోరాట దశలు దాటి శ్రీలంక తమిళుల ఉద్యమం 1970 వ దశకంలో  సాయుధ పోరాట మార్గం తీసుకున్నది. బ్రిటీష్ కాలం నుంచి ఉన్న ప్రత్యేక హక్కులను, మైనారిటీలకు ఉండే రాజ్యాంగ రక్షణలను తొలగించి 1973 లో శ్రీలంక సింహలులకు అనుకూలమైన కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంది. దీంతో అక్కడి తమిళులకు ఏమాత్రం రక్షన. భద్రత లేకుండా పొయాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో తమిళులకు ప్రవేశం కూడా కరువయ్యింది.  

ఈ తరుణంలో  తమిళ ప్రాంత స్వయం పరిపాలనకు విముక్తి మినహా మార్గం లేదని, దానికి సాయుధ పోరాటం ఒక్కటే పరిష్కారమని తమిళులు భావించారు. తమిళ యువత అనేక సాయుధ పోరాట దళాలు ఏర్పాటుచేసుకున్నారు.  అందులో ఒకటి లిబరేషన్ టైగర్స్ అఫ్ తమిళ్ ఈలం లేదా ఎల్‌టీటీఈ . ఒకరకంగా ఎల్ టీ టీ ఈ పుట్టుక (1976) తోనే లంకలో అసలు యుద్ధం మొదలయ్యింది. 1980 నాటికి శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో తమిళ ప్రజలకు అండగా టైగర్లు నిలబడ్డారు. ఇది సింహళ జాతి సహించలేక పోయింది. అంతర్యుద్ధం స్రుష్టించింది. తమిళ పౌరులు, ఇళ్ళు , ఊళ్ళు, వాడల మీద దాడులు చేసింది.  హిందూ దేవాలయాలు, తమిళ జాతి చిహ్నాలన్నే ధ్వంసం చేసింది. చివరకు సింహళ ప్రజల క్ర్రూరత్వం 1981 లో జాఫ్నా లోని చారిత్రక గ్రంధాలయాన్ని దహనం చేసే దాకా చేరుకుంది. ఈ దహన కాండ లో అప్పటికే ఆసియా ఖండంలో అతి ప్రాచీన చారిత్రక భాండాగారంగా పేరుగాంచిన మహా గ్రంధాలయం కాలి బూడిదయింది. ఆ తరువాత రెండు మూడేళ్ళ పాటు సింహలులు జరిపిన మారణకాండ లో వేలాది మంది మరణించారు.  లక్షలాది మంది శ్రీలంక వదిలి వెల్లిపొయారు. ఇది తమిళ జాతి మొదటి ఊచకోత గా చెప్పుకొవచ్చు. 

ప్రభాకరన్ నాయకత్వంలో ఎల్‌టీటీఈ దీర్ఘకాలం పోరాడి 1980 దశాబ్ద ఆరంభం నాటికి తమిళ కొన్ని ప్రాంతాలను విముక్తి చేసింది. అప్పుడు ప్రభాకరన్ భారత ప్రభుత్వానికి వీరపువూతుడిగా కనబడ్డాడు. ఇందిరాగాంధీ హయాంలో టైగర్లకు అన్నిరకాలుగా భారత్ సహకరించింది. శ్రీలంక సైన్యాలతో పోరాడుతున్న తమిళ మిలిటెంట్లకు ఆహారం, మందు లు, ఆయుధాలు భారత్ నుంచే అందేవి. ప్రభాకరన్ తో పాటు అనేక మంది తమిళ టైగర్లకు భారత్ శిక్షణనిచ్చిందని అంటారు. ఇందిరా గాంధీ ఆసియా రాజకీయాల్లో ఆదిపత్యం కోసం ఇలాంటి పనులు అనేకం చేసింది.పాకిస్తాన్ ని రెండు ముక్కలుగా చేసి బలహీన పరచడం కోసం బంగ్లాదేశ్ మిలిటెంట్లకు శిక్షణ నిచ్చినట్టే   శ్రీలంకను కూడా చేయాలని చూసింది. అది కుదరక పోగా రాజీవ్‌గాంధీ రంగ ప్రవేశంతో రాజకీయాలు మారాయి. ఆయన సార్క్ పేరుతో దక్షిణాసియా ను తన దారికి తెచ్చుకునే ఎత్తులు వేసాడు. తల్లి పెంచి పోషించిన తమిళ టైగర్లను తరిమివేసేందుకు ఆయన రంగంలోకి దిగాడు. హటాత్తుగా శ్రీలంకతో శాంతి ఒప్పందం చేసుకున్నారు. 1987లో భారత ‘శాంతిసేన’ పేరుతో శ్రీలంకకు సైన్యాన్ని పంపించి తమిళులను అణచివేసి అక్కడ శాంతి స్థాపించాలనుకున్నారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టి చివరకు ఆయనే 1991లో తమిళ టైగర్ల చేతిలో హత్యకు గురయ్యారు. 

బహుశా ఇప్పుడు భారత్ మౌనంగా ఉండడానికి తమిళుల మీది ప్రతీకారమే కారణమా! ‘పరిణామాలు అలాగే కనిపిస్థున్నాయి. శ్రీలంక తమిళులు రాజీవ్ గాంధీని చంపారు కాబట్టి మేం జోక్యం చేసుకొం’ అన్న ధోరణిలో భారత ప్రభుత్వంఉన్నట్టు అనిపిస్తోంది. కానీ ప్రభుత్వాలకు రాగద్వేషాలు ప్రతీకారేచ్చ ఉండకూడదు. అలా లేదనే అనుకుందాం. అలా అనుకోకపోతే మనకు రాజ్యం పట్ల, దాని జిత్తులమారి తనం పట్ల  ఏహ్యభావం కలుగుతుంది. 


కానీ ఇప్పుడు భారత్ మౌనాన్ని వీడాల్సిన సమయం వచ్చింది. త్వరలోనే శ్రీలంకలో సాగుతున్న మారణకాండ, మానవహక్కుల హననం ఐక్యరాజ్య సమితిలో చర్చకు రానున్నాయి. ఇంతకాలం భారత్ మౌనాన్ని ఆసరాగా చేసుకుని శ్రీలంక తమిళజాతి నిర్మూలనకు పూనుకున్నది. ఒకవైపు చర్చలు సంప్రదింపులు చేస్తూనే శ్రీలంక్ ప్రభుత్వం తమిళ ప్రాంతాల్లో తన బలగాల విస్తరణకు పూనుకున్నది. ఎల్‌టీటీఈ చేసిన, చేస్తున్న హింసను సాకుగా చూపి దానినొక టెర్రరిస్ట్ సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది. అప్పటి దాకా హింసను ప్రేరేపించిన దేశాలన్నీ హటాత్తుగా శాంతిమార్గం పట్టాయి. ఇట్లా ఎల్‌టీటీఈని ఒంటరిని చేసి శ్రీలంక సైన్యం 2008-09లో చేసిన చివరి ముట్టడిలో మొత్తం తమిళ ప్రాంతాన్ని ఆక్రమించి, టైగర్లను మట్టుపెట్టింది. లంక సైన్యం దాడుల్లో ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్, ఆయన కుటుంబంతో పాటు లక్షలమంది హతమయ్యారు. దాడుల్లో కొందరిని చంపితే వేలాదిమందిని నిర్బంధంలోకి తీసుకుని ‘నో వార్ జోన్’కు తరలించి చంపేశారని, శవాలను కూడా అత్యాచారాలు చేసి కసి తీర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. పసిపిల్లలకు పాలు అందకుండాచేసి చంపేశారని, శరణార్థ శిబిరాల్లో క్షతగావూతులై ఉన్న ముసలివాళ్ళను, మహిళలను వైద్యం అందకుండాచేసి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. 

ఈ ఆరోపణలకు బలం చేకూర్చే అనేక ఆధారాలను చానల్ 4 సమకూర్చింది. వాటి మీద ఇప్పటికే అంతర్జాతీయ విచారణ సంస్థలు నిజనిర్ధారణ జరిపి శ్రీలంక ఆకృత్యాలను నిరూపించాయి. ఐక్యరాజ్య సమితి కూడా వాటిని నిర్ధారించిం ది. ఈ అంశాలన్నీ సాక్షాధారాలతో సహా ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి అందాయి. ఆ అఘాయిత్యాలు చేసిన సైనికులు తీసిన ఫోటోలు, వీడియోలే ఇప్పుడు సమితి చేతికి అందాయి. అవి నిజమని నిర్ధారణ కూడా అయ్యింది. అందులో బాల చంద్రుడు కూడా ఉన్నాడు. అవును చానల్ 4 బాలచంద్రన్  హత్యోదంతం వీడియోను అక్కడ ప్రదర్శించనుంది. లంక సైనిక మూకల క్రౌర్యానికి బలైపోయిన ఆ వీర పుత్రుడు జెనీవాలో జరిగే సదస్సులో తన జాతి హననానికి మూగ సాక్షిగా నిలువబోతున్నాడు. అమెరికా కూడా ఈ విషయం మీద సీరియస్ గా నే ఉన్నది. బాలచంద్రన్ తో పాటు అలాంటి అనేక 'మరణ వాగ్మూలాల' మీద విచారణ జరుగాలంటే ఇప్పుడు ఆ సాక్షాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత భారత ప్రభు త్వం మీద ఉన్నది. భారత్ గట్టిగా నిలబడితే శ్రీలంక మీద చర్య తీసుకోవాలన్న డిమాండ్‌కు బలం చేకూరుతుంది. 



ఇప్పటికే లంకలో తోటి భారత సంతతి మీద సాగుతున్న నరమేధం మీద చర్చ జరుగుతున్నది. తమిళజాతి గుండె పగిలి రోదిస్తున్నది. అంతటి విషాదంలోనూ తమిళ సమాజం తెలంగాణ ఉద్యమానికి తన సంఘీభావం ప్రకటించింది. శ్రీలంక తమిళుల ఊచకోతను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న ‘సేవ్ తమిళ్స్’ అనే వేదిక గత జనవరి 26 రిపబ్లిక్ డే నాడు చెన్నైలో ‘తెలంగాణ ఒక చారివూతక అవసరం’ పేరుతో ఒక పెద్ద సభ నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం తరఫున కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సీతారామరావు ఆ సభలో పాల్గొన్నారు. లిబరేషన్ పాంథర్స్ పార్టీ పార్లమెంటు సభ్యుడు తిరుమావలవన్ కూడా సభలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. తక్షణమే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సదస్సు తీర్మానిస్తూ తెలంగాణ ఉద్యమానికి తమిళ సమాజం తరఫున పూర్తి సంఘీభావం ప్రకటించింది. 

వారికి కృతజ్ఞతగా మాత్రమే కాదు, జాతుల పోరాటాలకు మద్దతుగా, క్రూర, నియంతృత్వ అణచివేత ధోరణులకు, జాత్యహంకార ధోరణులు, జాతుల హననానికి వ్యతిరేకంగా మనుషులుగా నిలబడ వలసిన అవసరం ఉన్నది. భారత ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ దిశగా నడిపించవలసిన అవసరం తెలంగాణ సమాజం మీద ఉన్నది. 


శుక్రవారం, ఫిబ్రవరి 01, 2013

ముమ్మాటికీ మూడు తరాల మోసం




తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేసింది. నమ్మించి మోసం చేయడం ఆ పార్టీ నైజం. నెలరోజుల్లో తెలంగాణ ఇస్తామని యూపీఏ ప్రభుత్వం సాధికారంగా చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించి మరోసారి తను మారలేదని నిరూపించుకున్నది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను గమనించిన వారెవరికైనా ఇదేమంత ఆశ్చర్యపోదగిన విషయం కాదు. కానీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రం ఇది ఆందోళన కలిగించే విషయం. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలాంటి అధికారిక నిర్ణయాలయి నా ముందు ప్రజల్లో, పార్టీల్లో చర్చకు వచ్చి ప్రభుత్వ నిర్ణయం కోసం చట్టసభల ముందుకు, మంత్రివర్గం ముందుకు వస్తాయి. వాటిని ఆమోదించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఏ రకమైన పాలనా వ్యవస్థలోనైనా ప్రభుత్వాలు ఎవరికీ లొంగి పనిచేయవు. సర్వ స్వతంవూతంగా వ్యవహరిస్తాయి. అలా ఉన్నప్పుడే దాన్ని సార్వభౌమాధికార వ్యవస్థ అం టాం.

కానీ తెలంగాణ విషయంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అలా కనిపించడం లేదు.అసలు దేశంలో ప్రజాస్వామ్యమే ఉన్నట్టు అనిపించడం లేదు. నిజంగానే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా ఉన్న రాజ్యాంగం మీద నమ్మకం,విశ్వాసం ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో 2009 నాటి ప్రకటనకు కట్టుబడి ఉండేది. ఆగిపోయిన ప్రక్రియను కొనసాగించేది. అఖిలపక్ష భేటీలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఉండేది. కేం ద్ర హోంశాఖా మంత్రి సుశీల్‌కుమార్ షిండే ముందుగా ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 28న ప్రకటన చేసి ఉండేవాడు. కానీ ఇప్పు డు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సచివాలయంలో లేదు. అది అమ్మగారి అంతఃపు రంలో ఉన్నది.

ఆ అమ్మగారు ఆమె అత్తగారిలాగే గుత్తపెత్తందారై వ్యవహరిస్తున్నది. ఇందిరాగాంధీ సంజయ్‌గాంధీ కోసం తప్పులు చేసినట్టే ఇప్పుడు సోనియాగాంధీ తన కొడుకు కోసం కోటి తిప్పలు పడుతున్నది. అందుకే ఇప్పుడు మళ్ళీ చర్చలని అంటూ తెలంగాణ విషయాన్ని మొదటికి తెచ్చిం ది. దానికి కారణం రాహుల్‌గాంధీ అని తెలంగాణ కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఆయనను ప్రధానిగా చూడాలన్న తల్లిగారి తాపవూతయం. ఆతల్లిగారికి తెలంగాణ కోసం పిట్టల్లా రాలిపోతున్న పిల్లలు గుర్తుకు రాలేదు. ఆ పిల్లలకు కూడా తనలాగే తల్లులున్నారని, వాళ్ళు కూడా తనలాగే పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కని ఉంటారని ఆమె ఆలోచించలేదు.

ఆమెకిప్పుడు యువరాజు పట్టాభిషేకం తప్ప ఇంకేమీ కనిపించ అందుకే ఆమె సీమాంధ్ర నాయకత్వానికి తలొగ్గి తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసింది. తెలంగాణ నిర్ణయం ప్రకట వెలువడడానికి ముందు సీమాంధ్ర మంత్రులు, ఎమెల్యేలు, ఎంపీలు ఢిల్లీ వెళ్లి చెప్పింది ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఆంధ్రవూపదేశ్ పెద్ద రాష్ట్రంగా ఉంటే ఎక్కువమంది ఎంపీలను మళ్ళీ గెలిపించుకుని రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తామని వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. ఆ తరువాత రాజమంవూడిలో బహిరంగసభ పెట్టి కూడా అదే సంకేతం పంపారు.

ఢిల్లీలో పరిణామాలు గమనించిన వారికి వారంరోజుల గందరగోళం అంతా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం సృష్టించినదేనన్న విషయం స్పష్టంగా అర్థమౌతుంది. ప్రభుత్వం తరఫున హోం మంత్రి చేసిన ప్రకటనను కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్ ఎద్దేవా చేసిన పద్ధతి కాంగ్రెస్ రాజకీయ కుత్సితత్వానికి అద్దం పడుతున్నది.

నెల అంటే ముప్ఫై రోజులు కాదని, వారానికి ఏడు రోజులు కాదని ఒక జాతీయ నాయకుడు మాట్లాడడం అమాయకత్వమో, అతి తెలివో కాదు. అహంకారం. మేమే సర్వస్వం అన్న నిరంకుశత్వం. కాంగ్రెస్‌కు అటువంటి నిరంకుశ పూరిత విపరీత ధోరణి ఉందని చెప్పడానికి చరివూతలో అనేక సాక్ష్యాలున్నాయి. ఆ ధోరణి వల్లే ఇప్పుడు తెలంగాణ నాయకత్వం మీద తప్పుడు కేసులు బనాయించి అణచివేసే దిశగా ఆలోచిస్తోంది. కాంగ్రెస్‌పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిందని చెప్పడానికి కేసీఆర్, కోదండరామ్ అవసరం లేదు. చరిత్ర చదివి న ఎవరికైనా అర్థమౌతుంది. తెలంగాణ విషయంలో మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన రాజకీయ విధానం పరిశీలించిన ఎవరికైనా అది సులభంగానే అర్థం అవుతుంది. కాలం మారిపోయింది. ఎంతగా మారిందంటే దొంగలను దొంగలనడం నేరమైపోయిందిదోహులను ద్రోహులంటే తప్పయిపోతున్నది. చరివూతలో ఏం జరిగిందో చెపితే అదొక పెద్ద అపచారమైపోయింది.

నిజానికి చట్టం-న్యాయం ఈ దేశంలో రాజ్యాం గ ఉల్లంఘన కింద, విశ్వాస ఘాతుకం కింద, నమ్మించి ద్రోహం చేసిన నేరం కింద కాంగ్రెస్‌పార్టీ నాయకత్వం మీద కేసులు నమోదు కావాలి. తెలంగాణ ఆకాంక్షను ఆరు దశాబ్దాల పాటు అణచివేసి, ఇక్కడి ప్రజానీకా న్ని నిజంగానే రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్‌పార్టీని నేరాభియోగం మోపి విచారించాలి. ఒక్క హత్యకే ఉరిశిక్ష వేసే చట్టమున్న దేశంలో వేయిమంది అమాయకులను నమ్మించి మోసంచేసి వారి చావుకు కారణమయిన వారికి ఏ శిక్షా ఉండకపోవడం, 1969లో వందలాదిమంది తెలంగాణ బిడ్డల్ని నడిరోడ్డుమీద పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపిన వాళ్ళ మీద కనీస విచారణ కూడా లేకపోవడం విషాదం.

నెహ్రూ కుటుంబం దేశానికి చేసిన సేవ, త్యాగాల పట్ల ఎవరూ అనుమానాలు వ్యక్తంచేయలేదు. ఎవరూ ఆ కుటుంబపు దేశభక్తిని శంకించడం లేదు. అందుకు ఆ కుటుంబం తరతరాలుగా అధికారాన్ని అనుభవించింది. ఆ ఒక్క కుటుంబం నుంచి ఇప్పటికి ముగ్గురు ప్రధానులై పాలించారు. ఇప్పు డు నాలుగోవ్యక్తి పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకరకంగా మహాత్మాగాంధీ ఎప్పుడో మూసేయాలన్న కాంగ్రెస్ దుకాణం ఇంకా కొనసాగుతున్నదంటే అందుకు ఆ కుటుంబమే కారణం. కాబట్టి ఆ పార్టీ నేతలు, కార్యకర్త లు ఆ పార్టీ పట్ల భక్తిభావం కలిగి ఉండొచ్చు.

కానీ అందరూ అలాగే భక్తులై భజన చేయాలనుకుంటే కుదరదు. ప్రతి మనిషికీ, ప్రతి జాతికీ ఒక అంచ నా, అవగాహనా ఉంటాయి. అలా ఉండడం మనుషుల సామాజిక లక్ష ణం. అంతేకాదు రాజ్యాంగబద్ధమైన రాజకీయ హక్కు కూడా. తమ జీవితాల్లో ఆయా వ్యక్తులు, వ్యవస్థలవల్ల కలిగిన లాభనష్టాలను బట్టి, అనుభవాలను బట్టి అంచనాలు ఉంటాయి. నెహ్రూతో తెలంగాణ ప్రజల అనుభ వం అత్యంత మోసపూరితమైన అవకాశవాదంతో మిళితమైనది.

ఈ ప్రాంత ప్రజలను నెహ్రూ ఒకటికి రెండుసార్లు వంచించాడని చారివూతక సంఘటనలే చెపుతున్నాయి. ఒకటి హైదరాబాద్‌ను ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా సైనికచర్య ద్వారా భారత్‌లో కలిపేసుకోవడం. ఒకవైపు హైదరాబాద్‌తో యథాతథ ఒప్పందం అమలులో ఉండగా మరోవైపు ఐక్యరాజ్యసమితిలో కేసు విచారణలో ఉన్న సందర్భంలో భారత సైన్యం ఏకపక్షంగా దాడి చేసింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రజాస్వామ్యవాదులు ఖండించారు. హైదరాబాద్ ప్రజలు కచ్చితంగా భారతదేశంలోభాగం కావాలనే కోరుకుని ఉండేవారు. కానీ అది రాజకీయ ఒప్పందంతో జరిగితే ఈ ప్రాంత స్వయం ప్రతిపత్తికి ఉపయోగకరమైన రీతిలో ఉండేది.

ఈ ప్రాంతానికి కొన్ని హక్కులు, అధికారాలు దక్కేవి. కానీ నెహ్రూ అలాంటి రాజనీతిని ప్రదర్శించలేదని, పూర్తిగా కుట్రపూరితంగా, మోసపూరితంగా చేశారని పుంఖాను పుంఖాలుగా పుస్తకాలే వచ్చాయి. ఇక రెండోది ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు. ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా కుట్రపూరితంగా జరిగిందన్నది వాస్తవం. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రా విడిపోయిన సందర్భంగా అక్కడి ముఖ్యమంత్రి రాజాజీకి 1953 జూలై రెండున రాసిన లేఖలో కొందరు హైదరాబాద్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి ఆంధ్ర ప్రాంతంతో కలపాలని కమ్యూనిస్టులు చేస్తున్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ..‘అది అవాంచనీయం, దురదృష్టకరం, అంతేకాదు అది హైదరాబాద్‌కు హానికరం’ అని భావిస్తున్నాను అన్నారు.

ఎంతో శ్రమపడి హైదరాబాద్‌ను దేశంలో కలిపాం ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితిని గాడిలో పెట్టాం. ఇప్పుడు హైదరాబాద్ తెలుగు ప్రాంతాలను విడదీసి విశాలాంధ్ర ఏర్పాటుచేస్తే ఆ చర్య హైదరాబాద్ ప్రగతిని దెబ్బతీస్తుంది, అంతేకాదు మొత్తం దక్షిణ భారతదేశ్ సమతుల్యాన్ని దెబ్బతీసి భవిష్యత్తులో అన్నిరకాల సమస్యలకు కారణం అవుతుందని నేను కచ్చితంగా చెప్పగలను అన్నారు. ఆ తరువాత రెండేళ్లకు ఆయన హైదరాబాద్ రాష్ట్రంలోని కన్నడ, మరాఠీ ప్రాంతాలను విడదీసి భాషావూపయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న ఎస్సార్సీ నిర్ణయానికి తలొగ్గారు. 1955 డిసెంబర్ 21న పార్లమెంటులో మాట్లాడుతూ తెలంగాణను ఐదేళ్లపాటు స్వతంవూతంగా ఉంచి ఆ తరువాత ప్రజాభివూపాయం తీసుకోవాలన్న నిర్ణయానికి నెహ్రు తన అసమ్మతిని తెలియజేశారు.

మళ్ళీ వాదోపవాదాలకు తావులేకుండా చూడాలని కూడా ఆయన కోరారు. అంతటితో ఆగకుండా నిజామాబాద్ వచ్చి ‘విశాలాంధ్ర ఏర్పాటు వెనుక సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష ఉందని’ కమ్యూనిస్టులను ఉద్దేశించి స్వయంగా నెహ్రూ గారే చెప్పారు. ఇంకా అనేక సందర్భాల్లో ఆయన ఇలాంటి గంభీరమైన ఉపాన్యాసాలను చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించారు. ప్రజలు పాపం చాచా నెహ్రు చాలా మంచోడనే విశ్వసించారు. కానీ ఆ తరువాత ఏడాదికే ఆయన ఆంధ్రా లాబీకి దాసోహమై ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. నెహ్రూ గారిని నమ్మిన పాపానికి ఇలా చేయడం ముమ్మాటికీ మోసమని, విద్రోహమని తెలంగాణ ప్రజలు భావిస్తే ఆ తప్పు ఎవరిదో విజ్ఞులైన వాళ్ళు ఆలోచించాలి.

నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ప్రధాని అయిన రెండేళ్లకే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమాన్ని వాడుకోవాలని కాంగ్రెస్ నాయకత్వమే భావించింది. కాంగ్రెస్ నాయకులే రెండుగా చీలి ఉద్యమాన్ని దావానలంగా మార్చేశారు. మర్రి చెన్నాడ్డి ఉద్రేకపూరిత ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగించేవి. చాలామంది ఆయనను నమ్మి అమాయకంగా అనుసరించారు. ఇందిరాగాంధీ తెలంగాణ పట్ల తనదైన ‘జూద వ్యూహాన్ని’ అమలు చేసింది. ఒకవైపు తెలంగాణ ఇస్తామని నమ్మబలుకుతూనే మరోవైపు ఎనిమి ది సూత్రాల పథకం, ఐదు సూత్రాల పథకం, ఆరు సూత్రాల పథకం పేరుతో అనేక పావులు కదిపింది. చివరకు న్యాయ సమ్మతమని సుప్రీంకోర్టు ధ్రువీకరించిన ముల్కీ నిబంధనలు కూడా తొలగించి తెలంగాణ ప్రజలకు ఆమె తీరని అన్యాయం చేసింది. మరోవైపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందడ్డిని పురమాయించింది.

అత్యంత నిరంకుశంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 370 మంది తెలంగాణ యువకుల ప్రాణాలు పోయాయి. బ్రహ్మానంద రెడ్డి కర్కశత్వానికి కలత చెందిన తెలంగాణ పులిబిడ్డ ఈశ్వరీబాయి హూంకరించి ఇంకా ఎంతమంది మా బిడ్డలా ప్రాణాలు తీస్తావు, ఎందరిని పొట్టన పెట్టుకుంటావు అని శాసనసభలో నిలదీసింది. అప్పటి నరమేధానికి శాసనసభ చర్చల్లోనే అనేక సాక్ష్యాలు దొరుకుతాయి. ప్రత్యక్షసాక్షులు ఇంకా బతికే ఉన్నారు. కానీ ఆ రక్తపాతానికి కారకులైన వాళ్ళు మాత్రం లేరు. తెలంగాణ యువకులు నెత్తురోడిన నేలమీద ఇప్పుడు వాళ్ళ రాతి విగ్రహాలున్నాయి. ఎవరిమీద కేసు పెట్టగలం?

సోనియాగాంధీ మాటలకు సాక్ష్యాలతో పనిలేనే లేదు. ఆమె పార్టీకి చెంది న పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ మొన్ననే ఒక వీడియో చూపించారు. 2004 ఎన్నికల నాటి నుంచి ఇదిగో అదిగో అంటూ ఆమె మాటలమీద మాటలు మారుస్తూనే ఉన్నది. ఆమె మనసు మారినప్పుడల్లా, మాట తప్పినప్పుడల్లా గుండెలవిసిన అమాయక ప్రజలు ఆత్మహత్యల బారిన పడుతూనే ఉన్నారు. ఆమె వైఖరి వల్లే యువకులు ఆత్మహత్యల పాలవుతున్నారని కోర్టు కేసులు దాఖలైన సంగతి అందరికీ తెలుసు. ఆమె పేరుపెట్టి మరీ మరణ వాంగ్మూలాలు రాసిన సంగతి పత్రికలే ప్రచురించాయి.

అది నిజంగానే భరించలేని రంపపుకోత. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుం ది. ఇప్పటికే వేలాదిమంది తల్లులు, తండ్రులు, అన్నలు, చెల్లెండ్లు తమ కుటుంబసభ్యులను కోల్పోయి ఉన్నారు. సోనియాగాంధీ మాట్లాడితే ఒక విశ్వాసం, నమ్మకం కుదిరేదేమో కానీ ఆమె మౌనం రాచి రంపాన పెట్టడం కాదా! మనసున్న వాళ్ళు ఆలోచించాలి. 

అరవై ఏళ్ళు, మూడు తరాలు మోసానికి గురిచేసి ఉండకపోతే నిజంగానే తెలంగాణ ఎప్పుడో వచ్చేది. దీనంతటికి నెహ్రు కుటుంబం మాత్రమే కారణం అంటే మన నాయకులు ఒప్పుకోలేరేమో. ఎందుకంటే నెహ్రూ మొదలు, ఇందిరా, సోనియా వరకు వాళ్లకు వాళ్ళే తెలంగాణ ప్రజలను వంచించలేదు. అందులో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కూడా ఉన్నది. నిన్న కిరణ్‌కుమార్‌డ్డి చుట్టూ ఉన్నట్టే, ఒకప్పుడు నెహ్రు చుట్టూ, ఇందిరాగాంధీ చుట్టూ, సోనియా చుట్టూ తెలం గాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర భజనపరులు ఉన్నా రు. వాళ్ళే ఇప్పుడు రాహుల్ కోటరీలో కూడా చేరిపోతున్నారు. ప్రముఖ పాత్రికేయుడు టంకశాల అశోక్ చెప్పినట్టు తెలంగాణలో ‘కుమ్ముక్కు నాయక త్వం’ ఉన్నది. దాన్ని ఓడించకపోతే తెలంగాణ గెలవడం కష్టం.