అవినీతి- సమాజం-రాజకీయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవినీతి- సమాజం-రాజకీయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, మే 31, 2012

దేవుడు చేసిన మనుషులు!



దేవుడు ఉన్నాడా లేడా ఆన్న చర్చ ముగిసి చాలాకాలమే అయ్యింది. నమ్మే వాళ్ళు ఉన్నాడని, నమ్మనివాళ్ళు  లేడని  నిర్ధారించుకున్నాక చర్చకు కాలం చెల్లింది. కానీ ఇప్పుడు అదే చర్చ మళ్ళీ తెరమీదికి వస్తోంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడని అనుకున్నవాళ్ళకు  లేడేమోనని, లేనే లేడని వాళ్లకు ఉన్నాడేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి దేవుడు ఉన్నాడా లేదా ఆన్న సంశయానికి కారణం మనుషులే తప్ప దేవుడు కాదు. ఎవరైనా తప్పులు చేసినప్పుడు, అన్యాయంగా ప్రవర్తించినప్పుడు, వాటిని ఎదిరించే శక్తి, ధైర్యం లేనప్పుడు  దేవుడు ఉంటే బాగుండునని కోరుకుంటారు.

శనివారం, మే 19, 2012

కోస్తా తీరాన్ని కొల్లగొట్టారు!




జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ను సి బీ ఐ అరెస్టు చేసింది. వాన్పిక్ పేరుతొ వేలాది ఎకరాలు అక్రమంగా కాజేసిందుకు ఆయన ఇప్పుడు చంచల్ గూడా జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు. కానీ మా మిత్రుడు ఏడుకొండలు మాత్రం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి పోతున్నాడు. ఏడుకొండలుకు నిమ్మగడ్డ తో వ్యాపార పరమైన వైరమేమీ లేదు, అసలు ఆయనతో పరిచయం కూడా లేదు. కాకపోతే ఆయన వాన్పిక్ విద్వంసానికి ప్రత్యక్ష సాక్షి. వాన్పిక్ వల్ల ఉపాదికోల్పోయిన పల్లెకారుల ప్రతినిధి. సింగోతు ఏడుకొండలుది ప్రకాశం జిల్లా చినగంజాం మండలం లో ఒక చిన్న పల్లె. ఆ పల్లెనిండా పల్లెకారులే! సముద్రాన్నే నమ్ముకుని చేపలుపట్టి ఉపాధి పోసుకోవడం పల్లెకారుల వృత్తి. వారిలో చదువుకునే వాళ్ళే అరుదు. అటువంటి కుటుంబంలో చీరాలలో డిగ్రీ దాకా చదివిన ఏడుకొండలు తండ్రి మరణంతో పైచదువులకు స్వస్తి పలికి సముద్రాన్ని ఈదే సాహసం చేయలేక పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆశ్రయమిచ్చి ఆదుకుంది. ఉస్మానియా లో ఎం ఏ సైకాలజీ, బీ ఈ డీ, ఎం ఫిల్ చేసిన ఏడుకొండలు ఒకవైపు చదువుకుంటూనే చిన్నా చితకా పనులు చేసి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసారు. బాధ్యతలన్నీ తీరిపోయాయనుకున్న సమయంలో వాన్పిక్ ఉప్పెన వాళ్ళ ఊర్లన్నీ ముంచేసింది. ఉన్న ఎకరం, అరెకరం కూడా మిగలకుండా పోయేసరికి చిన్నా చితకా కుటుంబాల పరిస్థితి ఆయనను కలవర పెట్టింది.


ఆ సమయంలో ఏడుకొండలు మా విశ్వవిద్యాలయం లో తాత్కాలికంగా పనిచేసేవాడు. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న కాలంలో ఆయన ఉద్యమానికి తన పూర్తి మద్దతునిచ్చాడు. తాము కోస్తాలోనే ఉన్నా తమ పరిస్తితి తెలంగాణా లాగే ఉందని, అక్కడి సంపన్నులు తమని బతుకనిచ్చే పరిస్థితి లేదని వాపోయేవారు. వాన్పిక్ పేరుతో నిమ్మగడ్డ ప్రసాద్ సాగిస్తోన్న భూ సేకరణ బాగోతాన్ని వివరించి మమ్మల్ని వాళ్ళ ఊరికి ఆహ్వానించారు. నాతో పాటు పనిచేసే కొందరు అధ్యాపకులు, ఒకరిద్దరు జర్నలిస్టు మిత్రులం ఆయనతో పాటు వెళ్ళాం. రెండు రోజుల పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిమ్మగడ్డ కబంద హస్తాల్లో చిక్కుకున్న పల్లెల్ని వాన్పిక్ విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. బంగారం పండే భూములు, పుష్కలంగా నీల్లున్నా సాగుచేయలేని స్థితిలో ఉన్న రైతులు, సముద్రం ఒడ్డునే ఉన్నా అందులో చేపలుపట్టే హక్కులు లేని స్థితిలో పల్లెకారులు, ఊళ్ళో వ్యవసాయ పనుల్లేక ఉపాధి కోల్పోయిన కూలీలు, దళితులు ఇట్లా ఆ పల్లెలు కన్నేరుపెట్టడం కనిపించింది. తిరుగు ప్రయాణంలో సర్ మనం వీళ్ళకోసం ఏమైనా చేయగలమా? అని ఏడుకొండలు మళ్ళీ అడిగాడు. అప్పటికి రెండేళ్లుగా తెలంగాణా ప్రజలంతా ఏకభిగిన పోరాడుతున్నా స్పందించని ప్రభుత్వం తానే విధ్వంసానికి దిగుతుంటే ఏం చేయగలం. అప్పటికే ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం వాన్పిక్ కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు. అదొక్కటే పరష్కారం అనుకున్నాం. ఇప్పుడు అనుకోకుండా వాన్పిక్ అధినేత జైలు పాలు కావడం ఒప్పందాలు రద్దవుతాయన్న వార్తలు వస్తోన్న నేపద్యంలో ఏడుకొండలు కు ఫోన్ చేసాను. ఆయన స్వరంలో ఒక కొత్త ఆశ ద్వనించింది. ఇదే ఆశ ఇప్పుడు ప్రకాశం గుంటూరు జిల్లాల్లోని లక్షలాది మందిలో ప్రతిధ్వనిస్తోంది. అక్కడి రైతులు తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాన్పిక్ ను రద్దుచేసి తీరాలని కోరుతున్నారు.


జగన్ అక్రమ ఆస్తుల కేసులో సి బీ ఐ విచారణ, నిమ్మగడ్డ అరెస్టు పుణ్యమా అని ఇవాళ ఆకడి ప్రజలకు ఆ ధైర్యం వచ్చింది. వాన్పిక్ అనే సంస్థకు జరిగిన భూ కేటాయింపులన్నీ 'క్విడ్-ప్రొ-కో" ప్రాతిపదికన జరిగినవేనని సి బీ ఐ అంటోంది. న్యాయ శాస్త్ర పరిభాషలో "క్విడ్-ప్రొ-కో" ఆంటే బదులుకు బదులు అని. ఆంటే దాదాపు ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది. మీకు ఎవరైనా మేలుచేస్తే అందుకు ప్రతిగా మీరు అతనికి చేసే మేలు అన్నమాట. నిమ్మగడ్డ ప్రసాద్ తన సంపదలో దాదాపు ఎనిమిది వందల కొట్లు జగన స్థాపించిన పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడని సి బీ ఐ గుర్తించింది. ఆయన ఒక వ్యాపారవేత్తగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ అలా పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిఫలంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలను ఆయనకు రాసిచ్చాడని, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అలా భూములు కేటాయించే ముందు కనీస నిబంధనలు పాటించలేదని, మంత్రివర్గ ఆమోదం కూడా పొందకుండానే పనులు జరిగాయని, ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత లేదని ఇలా తవ్విన కొద్దీ అనేక పెంకులు అందులో దొరుకుతున్నాయి. సాక్షి, టీ వీ, చానెల్, పత్రికలో పెట్టుబడులు పెట్టినందుకు వంపిక్ అనే సంస్థకు భూ కేటాయింపు జరిగిందని చెపుతున్నారు. అందులో నిజమెంతో కోర్టులు తేల్చాల్సి ఉంది. అది పక్కన పెడితే వాన్పిక్ కోస్తాలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అధికార బలాన్ని ఆసరా చేసుకుని ఆ ఆ సంస్థ అనేక అమానవీయ చర్యలకు పూనుకుంది.


వాన్పిక్ పూర్తి పేరు వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ & ఇండస్త్రియాల్ కారిడార్. ప్రకాశం జిల్లాలోని చీరాల దగ్గర ఉన్న వాడరేవు అనే ఊరినుంచి గుటూరు జిల్లా నిజాంపట్నం వరకున్న కోస్తా తీరాన్ని రాజశేకర్ రెడ్డి గారి హయాంలో నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ సంష్తకు కట్టబెట్టారు. ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఓడరేవులు నిర్మిస్తానని, విద్యుత్ ఉత్పత్తికి పవర్ స్టేషన్ లు నెలకొల్పుతామని, పారిశ్రామిక వాడలు, ఆధునిక విమానాశ్రయం కడతామని నమ్మబలికి ఆయన ఇక్కడ భూసేకరణకు పూనుకున్నారు. ప్రభుత్వం అడ్డూ అదుపూ లేకుండా ఆయన కంపనీకి భూసేకరణకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆఘమేఘాలమీద దాదాపు 34 గ్రామాల్లో 15 వేల ఎకరాల భూమిని తీరప్రాంతంలో ఆయనకు కేటాయించింది. దీనిలో దళితులు గత ముప్పై సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్న భూములతో పాటు అటవీ  భూములు, సముద్రపు కోతను ఆపేందుకు   చెట్లనుపెంచే నేలలూ ఉన్నాయి.

ఇలాంటి భూములు కేటాయించడం పర్యావరణానికి ముప్పు అనీ, తీర ప్రాంతాల భూములు ప్రైవేటు కంపనీలకు ఇవ్వడం దేశ భద్రతకు ప్రమాదమని నిపుణులు చెప్పినా రెడ్డి గారు వినలేదు సరికదా మరింత భూమి ప్రయివేటు వ్యక్తులనుంచి, రైతులనుంచి సేకరించుకునే స్వేచ్చను ఆ కంపనీకి ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఈ పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకునా పూర్తిచేసేందుకు రైల్వే శాఖలో ఉన్న తన బంధువు బ్రమ్హానంద రెడ్డి ని ప్రత్యక అధికారిగా నియమించారు. ఇంకేముంది నిమ్మగడ్డ తన సామ్రాజ్యాన్ని ౩౦ వేల ఎకరాలకు విస్తరించాడు. అప్పటి కలెక్టర్లు మొదలు, రెవిన్యూ యంత్రాంగమంతా రెండేళ్ళ పాటు ఈ పనిలో తరించింది. వాన్పిక్ ఇచ్చిన పరిహారంతో పెద్ద భూస్వాములు, కమీషన్ లతో బ్రోకర్ లుగా పనిచేసిన చోటా మోటా రాజకీయ నాయకులు, ఎం ఎల్ ఏ లు, మంత్రులు కోట్లకు పడగలెత్తారు. లక్షలాది రైతులు, కూలీలు, సముద్ర తీరాన్ని రేవులను నమ్ముకుని బతికే మత్సకారులు వీధిన పడ్డాయి. దాదాపు నలభై గ్రామాలు స్మశానంగా మారే పరిస్తితి వచ్చింది. ఒక్క సి పీ ఐ మినహా అన్నిపార్టీల నాయకులను కంపనీ కొనేసి ప్రతిఘతిస్తోన్న ప్రజల గొంతులు వినిపించకుండా చేసేసాయి. ఆ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళెవరూ అక్కడ అడుగుపెట్టకుండా పోలీసులతో దిగ్భందం చేసి భూసేకరణను జరిపారు. ఈ సందర్భంగానే సి పీ ఐ నాయకులు నారాయణ రహస్యంగా పడవలో ప్రయాణించి అక్కడికి చేరుకుంటే మీడియా అక్కడ ఆయన గాంధీ జయంతి రోజున చికెన్ తింటున్న దృశ్యాన్ని చిలువలు పలువలు చేసినంతగా అక్కడి పోరాటాన్ని ప్రచురించలేదు, ప్రసారం కూడా చేయలేదు. అలా అందరినీ కోనేయగల శక్తి కలిగిన నిమ్మగడ్డ ఇప్పుడొక చానెల్ కు అధిపతి మరొక చానెల్ కు పెట్టుబడి దారుడు! ఇప్పుడు నిమ్మగడ్డ అరెస్టు పత్రికా స్వేచ్చను హరించడమే అని కూడా ఎవరైనా అనవచ్చు!!


నిజానికి పత్రికా స్వేచ్చ ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మన రాజ్యాంగంలో మనిషికి మించిన హక్కు మరెవరికీ లేదు. రాజ్యాంగం ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్చ ఉందన్తూనే ఆ తరువాతి పేరాలోనే దానికుండే పరిమితులను కూడా చెప్పింది. ప్రజల భావ ప్రకటన స్వేచ్చకు వాహికగా ఉన్నదే మీడియా కాబట్టి రాజ్యాంగం చెప్పిన పరిమితులకు లోబడే మీడియా పనిచేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం మీడియా స్వేచ్చను ప్రస్తావించక పోయినా మీడియాకు స్వేచ్చ ఉండాలన్నది ఒక ప్రజా స్వామిక ఆకాంక్ష. ఆ ఆకాంక్షను అనేక కోర్టులు నిర్ధారించాయి కూడా. అలాగే మీడియా స్వేచ్చ ఆంటే పాత్రికేయుల స్వేచ్చ. పత్రిక రచయితలు, ప్రచురణ కర్తల స్వేచ్చ అని అనేక సందర్భాల్లో కోర్టు లు తేల్చాయి. అంతే తప్ప యజమానుల స్వేచ్చ కాదని గుర్తించాలి. సాక్షి తెలుగు జర్నలిజం లో ఒక క్రియాశీలమైన పాత్ర పోషించింది. సాక్షి లో వచ్చిన వార్తల వల్ల ముఖ్యంగా ఈ రెండేళ్లలో నాణేనికి రెండో వైపు ఏముందో తెలిసి వచ్చింది. ఆ పత్రిక రాతలను, ప్రచురణను ఎవరైనా అడ్డుకోవడం ముమ్మాటికి పత్రికా స్వేచ్చ కిందికే వస్తుంది. ఇప్పుడు సి బీ ఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సాక్షి సిబ్బందిలో పాతకుల్లో ఆందోళన కు కారణం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పత్రిక ప్రచురణకు ఆటంకం కలిగించే విధంగా ఉంటున్నాయి. దాన్ని తప్పుపట్టవచ్చు. కానీ ఇదంతా నేరవిచారణలో భాగం అయినప్పుడు విచారణ జరిపే అధికారాన్ని ప్రశ్నించలేము. పత్రిక ప్రచురణకు, సిబ్బంది భద్రతకు భంగం కలుగకుండా ఏ విచారణయినా జరగాలి. పత్రికా స్వేచ్చ పేరుతో విచారణను అడ్డుకున్నా, విచారణ పేరుతో పత్రికా స్వేచ్చను హరిన్చినా న్యాయం కాదు. దీన్ని ప్రజాస్వామ్య వాదులెవరూ హర్షించ కూడదు. పత్రిక , చానల్ ఏదైనా ఒక ప్రయివేటు యాజమాన్యంలో నడిచే వ్యాపార సంస్థ, ఆ సంస్థ మూతపడితే దానికి యాజమాన్యం బాధ్యత వహించాలి. ఒకవేళ ప్రభుత్వం అన్యాయంగా మూత వేస్తే ప్రభుత్వం మీద జర్నలిస్టు సంఘాలు పౌరసమాజం ఒత్తిడి తెచ్చి దాన్ని తెరిపించాలి. అంతే  తప్ప ఇది పత్రిక కాబట్టి ఆ పత్రిక యజమానిమీద విచారణ వద్దన్నా, ఆ యజమాని తెచ్చిన పెట్టుబడులను ముట్టుకోవద్దన్నా భావ్యం కాదేమో ఆలోచించాలి. అదే న్యాయమని ఎవరైనా వాదిస్తే ఇక ముందు మనం ఏ పెట్టుబదిదారున్నీ విచారించాలేము. కాబట్టి పత్రికా స్వేచ్చను యజమానుల స్వేచ్చతో ముడిపెట్టి చూడకూడదు.


విచిత్రంగా కొందరు నిమ్మగడ్డ అరెస్టు ను పారిశ్రామిక ప్రగతికి అవరోధమని అంటున్నారు. సమాజంలో గౌరవ ప్రదమైన హోదాల్లో ఉన్న సంపన్నులను, పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న పారిశ్రామిక వేత్తలను అరెస్టు చేస్తున్నారని వాపోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు విచారణలో ఉన్న ఈ పెద్దమనుషులు ఈ రాష్ట్రంలో వేలాది కుటుంబాల్లో విధ్వంసం స్తుష్టించారన్న సంగతి దాచిపెడుతున్నారు. వాళ్ళ భూదాహానికి పాలమూరు జిల్లా పోలేపల్లి పేద రైతులతో సహా లక్షలాది జీవితాలు చిందర వందరైన సంగతి మరిచిపోతున్నారు. ప్రజల పోట్టలుగొట్టి పెట్టుబడులు పెట్టే ఇటువంటి పారిశ్రామిక వేత్తలేనా మనకు కావాల్సింది ఆన్న విషయాన్ని ఏ ఒక్కరూ ప్రస్తావించక పోవడం మన సంకుచిత అభివృద్ధి ఆకాంక్షకు పరాకాష్ట. ఇప్పుడు వాన్పిక్ ఒప్పందాన్ని రద్దుచేసి ఆ భూములను తిరిగి అక్కడి రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలాగే ఏమార్, పోలేపల్లి మొదలు చంద్ర బాబు హయాం నుంచి రాజశేఖర్ రెడ్డి రాజ్యందాకా సాగిన భూ పందేరాలన్నిటి మీదా విచారణ జరగాలి. ఇప్పుడు కోస్తాలో మొదలవుతున్నావాన్పిక్ భూస్వాధీన పోరాటం తెలంగాణా ఉద్యమానికి కూడా ఒక మోడల్ కావాలి. అక్కడైనా ఇక్కడయినా ఆక్రమణ దారుడు ఒకడే! లంకోహిల్ల్స్ , ఏమార్ , పోలేపల్లి అన్నీ అక్రమాలేనని విచారణలో తేలుతున్నది. వీటి మీద తెలంగాణా వాదులు దృష్టిపెట్టాలి. అక్రమంగా తీసుకున్న భూములన్నీ ప్రజలకు చెందాలి. ప్రజల ఆమోదంతోనే భూకేటాయింపులు జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్ఖ, లేకపోతే మన మాటలు, రాజకీయాలు, ఉద్యమాలు అన్నీ క్విడ్-ప్రొ-కో అనే భావించాల్సి ఉంటుంది

శుక్రవారం, మే 11, 2012

తెలంగాణ గళంలో కాషాయ గరళం!



బీజేపీ గురించి తరం నాయకుల్లో చాలామంది కంటే డా. దాసోజుశ్రావణ్కే ఎక్కువగా తెలుసు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరోలో క్రియాశీలంగా ఉన్న యువనేత పూర్వాక్షిశమం లో కరుడుగట్టిన కాషాయ కరసేవకుడు. శ్రావణ్ మాతో పాటు ఉస్మానియా యూనివర్సిటిలో చదువుతున్నప్పుడు అఖిల ఏబీవీపీ మిలిటెంట్ నాయకుల్లో ముఖ్యుడు.ఆయన ఏబీవీపీనుంచి ఆర్ట్స్కాలేజీ విద్యార్థిసంఘం ప్రధానకార్యదర్శిగా గెలుపొందారు. 1985-90 మధ్యకాలంలో కొన్ని వామపక్ష విద్యార్ధిసంఘాలను ప్రభుత్వం నిషేధించింది. మరికొన్నిటిని నిర్మూలించడానికి ఏబీవీపీ ప్రయత్నించేది. వామపక్ష, దళిత బహుజన విద్యార్ధి సంఘాలు, భావజాలంతో పనిచేసే విద్యార్థుల మీద ఏబీవీపీ ఆధ్వర్యం లో అనేక దాడులు జరిగేవి. ఆయనకు ఆకాలంలో అగ్రక్షిశేణి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి.

అదే శ్రావణ్ ఇప్పుడు బీజేపీ రాజకీయాలను ఏవగించుకుంటున్నాడు. మతతత్వ, ప్రాంతీయ అవకాశవాద పార్టీ అని, నిండుకుండ లాంటి తెలంగాణ ఉద్యమంలో విషపుచుక్క అని బీజేపీపై విరుచుకుపడ్డారు. శ్రావణ్ మాటలను రాజకీయ ప్రేలాపనలుగా కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆయన సంప్రదాయ రాజకీయ వాదికాదు. ఎంబీఏతో పాటు ఎంఏ, పీహెచ్డీ చేసిన శ్రావణ్ కొంతకాలం ఆధ్యాపకుడుగా ఉన్నా డు. తరువాత ప్రముఖ కార్పొరేట్ కంపనీలలో పనిచేసేవాడు.సామాజిక న్యాయం నినాదానికి ఆకర్షితుడై ప్రజారాజ్యంలో చేరిన శ్రావణ్ ఇప్పుడు తెలంగాణాతోనే అది సాధ్యమని నమ్ముతున్నాడు. నమ్మకంతోనే ఎన్ని ఒడిదుడుకులున్నా టీఆర్ఎస్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీ కుల, మతవాద ధోరణి తెలంగాణవాదానికీ, సామాజిక న్యాయానికి పెనుముప్పుగా మారిందని అంటున్నారు.ఆయనొక్కరే కాదు, జాతీయవాద పార్టీగా బీజేపీని అభిమానిస్తోన్న వాళ్ళు, సంఘ్ పరివార్ పట్ల గౌరవం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ రాజకీయ ఎత్తుగడలపట్ల ఆందోళన చెందుతున్నారు. ఇది బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు, ఆయన శిష్యుడు కిషన్రెడ్డి రాజేసిన కుంపటి అని వారి వాదన. కుంపటి ఇప్పుడు తెలంగాణ జేఏసీలో పొగపెడుతోంది. ఇది చాలా మంది తెలంగాణ వాదులను కలవరపెడుతోంది.

బీజేపీ పన్నెండేళ్ళ క్రితం కాకినాడలో కాగితంమీద రాసి పెట్టడం మిన హా సంస్థాగతంగా తెలంగాణ కోసం ఎన్నడూ పోరాడింది లేదు. 2004 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నడూ తెలంగాణ ఊసే ఎత్తలేదు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా పార్టీ అగ్రనాయకత్వం భావించింది.తెలంగాణ ఉద్యమం 2009 లో ఊపందుకున్న తరువాత పార్టీ గుంపులో గోవింద అన్నట్టుగా ఉద్యమానికి జైకొట్టింది. అడపాదడపా పార్టీ శ్రేణులను బహిరంగ సభలకు తరలించి బలోపేతం అయ్యే ప్రయత్నాలు చేసింది. బీజేపీకి ఎన్నడూలేని జనామోదం లభించడానికి పార్టీ సొంత ఎజెండా పక్కకుపెట్టి తెలంగాణ జేఏసీలో చేరడం కారణమయింది. తెలంగాణ జేఏసీకి ఉన్న విశ్వసనీయత మొత్తం తెలంగాణ సమాజాన్ని కులమతాలకు అతీతంగా, రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అందరినీ ఏకం చేయడానికి దోహదపడింది. సిద్ధాంతపరంగా బద్ధ శత్రువులుగా ఉండే నక్సలైటు పార్టీలు, ప్రజాసంఘాలతో బీజేపీ చేతులుకలిపి పనిచేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అప్పటిదాకా మతతత్వ రాజకీయాలు నడిపే పార్టీగా ఉన్న బీజేపీ, తెలంగాణ ఉద్యమ పార్టీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

చాలా మంది పార్టీని అంగీకరించే స్థితికి వచ్చారు. కేవలం తెలంగాణ సాధనే తప్ప మరో ఎజెండా లేని నాయకత్వం, దానికోసం సంఘటిత శక్తిగా కదిలిన ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, పౌర సమాజం వెన్నెముకగా ఉంటూ జేఏసీని నిలబెట్టాయి. పార్టీ తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పోరాడుతున్నదని నమ్మడం వల్లే నిజామాబాద్లో డి.శ్రీనివాస్ను కాదని ముస్లింలు కూడా జేఏసీ పై విశ్వాసంతో బీజేపీకి పట్టం కట్టారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మినారాయణ ముస్లిం వీధుల్లో తలపై టోపీ పెట్టుకుని కేసీఆర్, కిషన్డ్డితో కలిసి ఊరేగితే ప్రజలు నిజంగానే నమ్మారు. కానీ జేఏసీ కార్యక్షికమాల్లో, ప్రజా ఉద్యమ క్షేత్రంలో బీజేపీ కదలికలను నిశితంగా గమనించిన వారికి బీజేపీ పట్ల పెద్ద నమ్మకం ఎప్పుడూ లేదు.

బీజేపీ కూడా టీడీపీ లాగే రెండు కళ్ళ సిద్ధాంతాన్నే పాటించింది. పార్టీ తరపున రాజేశ్వర్రావు, విద్యాసాగర్రావు, దత్తావూతేయ, లక్ష్మణ్లాంటి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడితే కిషన్రెడ్డి మాత్రం వెంకయ్యనాయు డు కనుసన్నల్లో పనిచేస్తూ వచ్చారు. ఉద్యమం ఉధృతంగా ఉన్నరోజుల్లో బీజేపీ ఒకవైపు జేఏసీలో ఉంటూనే కార్యక్షికమాలకు దూరంగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. బతుకమ్మ ఆడడంలో ఆసక్తిగా పాల్గొన్న బీజేపీ శ్రేణులు సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె సందర్భంగా ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉన్నాయి. రైల్రోకో సందర్భంగా టీఆర్ఎస్, టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులు అరెస్ట్ అయినప్పుడు బీజేపీ అగ్రనాయకులు ఎక్కడా కనిపించలేదని ఉద్యమాన్ని పరిశీలించిన వారికి అర్థమవుతోంది. అలాగే జేఏసీ పిలుపు మేరకు అందులో భాగస్వామ్య పక్షాల ప్రతినిధులంతా రాజీనామా చేసిన సందర్భంలో కూడా కిషన్డ్డి రాజీనామా చేయలేదు.

జగన్ నిజామాబాద్ వచ్చినప్పుడు ఆయనను నిలదీయాలన్నా, చంద్రబాబును పాలకుర్తి రాకుండా అడ్డుకోవాలన్నా బీజేపీ స్పందించలేదు. పైగా అది తమ విధానం కాదని తప్పించుకున్నది. మహబూబ్నగర్ ఎన్నికలకు ముందు యాత్రచేసే దాకా ఆయన పెద్దగా ఉద్యమంలో లేరు. కనీసం ఉద్యమంలో పాల్గొని కేసుల పాలయిన వారిని విడిపించడంలో, నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు మనోధైర్యం నింపడంలో పార్టీ నిర్లిప్తతే దీనికి నిదర్శనం. ఆంధ్రాలో జై ఆంధ్రా నినాదంతో ముందుకు వెడతామని చెప్పిన పార్టీ మూడేళ్ళు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది.నిజానికి జై ఆంధ్రా ఆపార్టీ విధానం అయితే ఇప్పటికే అటువంటి నిర్మాణం, కార్యాచరణకు పూనుకుని ఉండాలి. భావ సారూప్యం ఉన్న రాజకీయ సంస్థలు, పౌర సమాజంతో అక్కడ కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఉండాల్సింది. కనీసం అక్కడ ఆంధ్ర రాష్ట్రంకోసం పోరాడుతున్న దళిత బహుజన సంఘాలకు బాసటగా ఉండాల్సింది. కొవ్వూరులో పోటీ చేసి తమ వాదనను వినిపించి ప్రజలను ఆదిశగా చైతన్యవంతులను చేయాల్సింది. ఆప్రాంతంలో తన కులంలో ఆదరణ ఉన్న వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక మహాకూటమి ఏర్పాటు చేయాల్సింది.ఇవేవీ పార్టీ చేయలేదు. విషయంలో సీపీఐని, ఆపార్టీ అధినేత నారాయణను అభినందించాలి. ఆయన ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే నాలుకతో మాట్లాడారు. జేఏసీలో భాగం కాకపోయినా అన్ని సందర్భాల్లోనూ సీపీఐని ప్రజలపక్షాన నిలబడేలా చూశారు. ఇలాంటి విమర్శలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ సుష్మాస్వరాజ్ పార్లమెంటు ప్రసంగాన్ని గురించి చెపుతుంటారు.

అది నిజమే, ఆమెకు స్పీకర్ అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ సమస్యను అద్భుతంగా ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకున్నది. అందు కే ఆమె తెలంగాణ ప్రజలకు దగ్గర కాగలిగారు. కానీ అన్నా హజారే అవినీతి అజెండాకోసం నెలలతరబడి పార్లమెంటు జరుగకుండా అడ్డుకున్న పార్టీ తెలంగాణ కోసం నిరవధికంగా పార్లమెంటును ఎందుకు స్తంభింప చేయలేక పోయింది? బీజేపీ ఎంపీల్లో వందమంది ఒక్కసారిగా లేచి నిలబడితే నిజంగానే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడతాయి. కానీ ఆపార్టీ అలా చేయలేదు. 2014 దాకా చేయదు కూడా! ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలలాగే సమస్య 2014 దాకా మిగిలి ఉండాలని కోరుకుంటోంది. 2014ఎన్నికల్లో తెలంగాణలోని అన్నిస్థానాల్లోఒంటరిగానే పోటీ చేస్తాం అని పార్టీ నేత కిషన్డ్డి ప్రకటించారు. మహబూబ్నగర్ విజయం తరువాత ఆయనలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.నిజానికి అప్పటినుంచే పార్టీ తప్పటడుగులు మొదలయ్యాయి. మహబూబ్నగర్ గెలుపు పూర్తిగా తనదేనని బీజేపీ భ్రమ పడుతున్నది. మహబూబ్నగర్లో బీజేపీ బలం కన్నా ఎన్నం శ్రీనివాసడ్డికి ఉన్న బలగం ఎక్కువ ప్రభావం చూపింది. శ్రీనివాసడ్డి పోటీ చేసే నాటికి ఆయనకు బీజేపీ సభ్యత్వం కూడా లేదు. ఆయన కరుడుగట్టిన తెలంగాణావాది. కేంద్రప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో చేరి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్తో విభేదించి బయటకు వెళ్ళినా పార్టీ శ్రేణులతో సాన్నిహిత్యం కొనసాగిం చారు. టీఆర్ఎస్ పట్ల అక్కడక్కడా ఉన్న అసంతృప్తిని కూడా అనుకూలంగా మలుచుకున్నారు.

ఆయనకు అక్కడ సామాజికంగా పెద్ద బలగమే ఉన్నది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న ఎన్నంను బీజేపీఅభ్యర్థిగా ఎంచుకుంది. ఇదే మహబూబ్నగర్ జేఏసీ రెండుగా చీలిపోవడానికి కారణం అయింది. అక్కడి జేఏసీలో వామపక్ష భావాలున్న విద్యావంతులు ఉన్నట్టే ఆధిపత్య కులరాజకీయాలు నడిపే వాళ్ళూ ఉన్నారు. బీజేపీ శ్రీనివాసరెడ్డి బలంతో పాటు ఆయన కులాన్ని కూడా ఆయుధంగా వాడుకున్నది. అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆయన ఒక్కరే రెడ్డి కావడం కలిసి వచ్చింది. ఇక రెండోది మతం.టీఆర్ఎస్ ముస్లిం అభ్యర్థిని రంగంలో దింపే సరికి బీజేపీ తన పాత మతవాదానికి పదునుపెట్టింది. కాషాయం పులుముకుని కిషన్రెడ్డి కాస్తా లాల్కిషన్ అద్వానీగా మారిపోయా రు. ఎన్నికను ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్తో పోల్చారు.ఆయనకు ముస్లిం సోదరుల్లో రజాకార్లు కనిపించారు. ఎన్నికల్లో గెలిచారు కానీ రెండేళ్లపాటు బీజేపీ నేతలు ఉద్యమంలో ఉంటూ పార్టీకి సమకూర్చిన సరికొత్త ఉదార రూపాన్ని మాత్రం చెరిపేసుకున్నారు. ఇప్పుడు ఆపార్టీ తెలంగాణ సాధనకు, ఉద్యమ సామాజిక న్యాయ ఎజెండాకు భిన్నంగా నడుస్తోంది. అందుకే పరకాలలో మరో శ్రీనివాసడ్డి కోసం గాలిస్తోంది. ఇప్పుడు పార్టీ చిన్నాచితక నేతలు కూడా సకల జనుల సమ్మె విరమణను తప్పుపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదనే వాదన లేవనెత్తుతున్నారు. శాసనసభకు జరిగే ఉపఎన్నికల్లో జాతీయ పార్టీ అవసరం ఏమిటో అర్థం కాదు. లోక్సభలో 114 మంది సభ్యులున్నా ఏమీ చేయలేకపోతున్న పార్టీ ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీలో నాలుగో సభ్యుడు గెలిస్తే తడాఖా చూపిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదు. బీజేపీ వైఖరి తెలంగాణవాదుల్లో ఆందోళన కలిగిస్తున్నది. భాగస్వామ్య పార్టీల ఆధిపత్య పోరు జేఏసీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇంతకాలం మీడియా గుసగుసలకే పరిమితమైన విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్ మాటల యుద్ధమే దానికి అద్దంపడుతోంది.

మహబూబ్నగర్ లో బీజేపీ ప్రదర్శించిన దూకుడే ఇప్పుడు పరకాలలో టీఆర్ఎస్ ప్రదర్శిస్తున్నది. కచ్చితంగా వరంగల్ జిల్లా టీఆర్ఎస్కు, తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు. మహబూబ్నగర్లో జేఏసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పటికైనా పరకాల నుంచి విరమించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిమీదయినా పోటీకి దిగొచ్చు. కానీ జేఏసీలో చేరిన పార్టీలు సమష్టిగా తెలంగాణ కోసం ఉద్యమిస్తామని, ఉద్యమ వ్యతిరేక శక్తులమీద యుద్ధం చేస్తామని చెపుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒకరిమీద ఒకరు యుద్ధానికి దిగి ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. ఇంతకాలం తమకు నీడనిచ్చిన చెట్టును తామే నరికేసుకుంటున్నాయి. జేఏసిని రద్దు చేస్తారని, కోదండ రామ్ను చైర్మన్ పదవినుంచి తప్పిస్తారని వార్తాకథనాలు వ్యాపిస్తున్నాయి. జేఏసీ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిఫలించే వేదిక. దాన్ని రద్దు చేయడమంటే తెలంగాణ ఉద్యమాన్ని రద్దు చేయడమే. హక్కు ఒక్కరికీ ఉండదు.

సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా తెలంగాణ సమష్టి, జన ఆకాంక్షకు అధికారిక ప్రతినిధిగా నిలబడ్డ వ్యక్తి కోదండ రామ్. ఆయన జేఏసీ ఏర్పడ్డాక ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తికాదు. మలిదశ ఉద్యమానికి పునాది వేసిన వారిలో ఒకరు. కీలకమైన సమయంలో ఉద్యమ రథానికి సారధిగా ఉన్న కోదండరామ్ను తొలగించే అధికారం కూడా ఎవరికీ లేదు. పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జేఏసీ సూచన మేరకు నడుచుకోవాలి. లేదంటే ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలి. ఉద్యమాన్ని విషతుల్యం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012

అధ్యక్షా ! ఆలకించండి...



ఆంద్ర ప్రదేశ్ శాసన సభకు స్పీకర్ ఎవరు? ప్రశ్నకు ఎవరైనా సరే నాదెండ్ల మనోహర్ అనే సమాధానం చెపుతారు. సాంకేతికంగా అది నిజమేకానీ ఇప్పుడు శాసన సభలో నెలకొన్న గందరగోళం గమనిస్తోన్న వారికి అలా అనిపించడం లేదుఎందుకంటే నాదెండ్ల మనోహర్ యువకుడు ఆధునిక చట్టసభల తీరుతెన్నులు తెలిసిన వ్యక్తి , ఎం బి చదివిన ఆయనకు నిర్వహణ శాస్త్రం తెలియదనుకోలేము. శాసన సభకు మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచీ శాసన సభ బయటిరాజకీయాలకంటే లోపలి వ్యవహారాల పైనే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్న వ్యక్తి. శాసన సభ గ్రంధాలయ కంప్యుటరీకరణ మొదలు ఇప్పుడు శాసన సభ ఆధునీకరణలో అత్యంత శ్రద్ధ కనబరుస్తున్న వ్యక్తి ఆయన. సభలో గెలుపొందిన ఒక్కొక్క గౌరవ శాసన సభ్యుడికి లాప్ టాప్, టాబ్లెట్ ఫోనెల వంటి ఆధునిక సమాచార సాధనాలు ఇచ్చి అవి ఎలా వాడాలో శిక్షణ కూడా ఇప్పించారు. అలాగే వారు సభలో జరిగే సుదీర్ఘ  చర్చల సందర్భంగా అలిసి పోకుండా అత్యాధునిక హంగులతో కుర్చీలు, టచ్ స్క్రీన్ లు, కొత్త మైకులు సమకూర్చారు.

పైగా శాసన సభ్యులకు విజ్ఞానం వినోదం కూడా అవసరమని గుర్తించిన వ్యక్తి ఆయన. అందులో భాగంగా ఇటీవల కొందరిని ఆహ్లాదభరిత వినోద విడిది కేంద్రమైన అరుకు తీసుకెళ్ళి ప్రజా సమస్యల మీద అవగాహన కల్పించారు. ఇలా శాసన సభకు సంబంధించిన  అన్నిటిమీదా ఆయన ముద్ర కనిపిస్తున్నా సభలోపలి వ్యవహారాలు మాత్రం అతని చేతిలో లేకుండా పోయినట్టు విమర్శలోస్తున్నాయి.  కుర్చీలు మారాయి తప్ప కుర్చీల్లో కూర్చుండే గౌరవ సభ్యుల తీరు మాత్రం మాత్రం మారలేదనే చెప్పుకోవాలి. ఒక్క సభ్యల ప్రవర్తనే కాదు స్పీకర్ సభను నిర్వహిస్తున్న తీరును, సభలో తమ పట్ల వ్యవహరిస్తున్న తీరునూ ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. సభలో చర్చ సరిగా జరుగుతుందన్న విశ్వాసం లేక ప్రధాన ప్రతిపక్షమే సభావ్యవహారాలు రూపొందించే కమిటీలను బహిష్కరిస్తుందంటే అది ఆలోచించ వలసిన విషయమే!

 ఇది ఒక్క సమావేశంలోనే కాదు. దాదాపుగా గడిచిన రెండేళ్లుగా సభ తీరు ఇలాగే ఉంది. సభలోని సభ్యులంతా శాసన సభ మీద, సభా వ్యవహారాల మీద విశ్వాసం ప్రకటించిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఇది ముమ్మాటికీ మంచిది కాదు.   పరిణామాల పట్ల  కేవలం సభాపతినే తప్పుపట్టలేం. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు రాజకీయ పార్టీలు, సభానాయకుడు, ప్రతిపక్షనేత ఇలా అంతా కూడబలుక్కునే సభను నిర్వీర్యం చేస్తున్నారని అర్థమౌతోంది. స్పీకర్ ఒత్తిడికి గురవుతున్నారని అర్థమౌతోంది

కానీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఒత్తిడులకు తలోగ్గితే అది కేవలం అతనికి,  సభాపతి పదవికి ఉన్న గౌరవానికే కాదు, మొత్తం ప్రజల సార్వభౌమాధికారానికే తలవంపు అవుతుంది.  ఎందుకంటే స్పీకర్ అనే వ్యవస్థ భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన సార్వభౌమాధికారానికి జవాబుదారీ.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలు ప్రజల మనోభావాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని, అక్కడి చర్చలు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింభిస్తాయని రాజ్యాంగ కర్తలు భావించారు. అటువంటి ప్రజల సభకు అధ్యక్ష స్థానంలో ఉండే స్పీకర్ తన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు, రాగద్వేషాల ప్రమేయం లేకుండా  ధర్మకర్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే భారతదేశపు తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రు స్పీకర్ పదవిని దేశ స్వేచ్చా స్వాతంత్రాలకు ప్రతీకగా అభివర్ణించాడు. స్పీకర్ చట్టసభ మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తారు. శాసన సభ అనేది ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రజల స్వేచ్చకు, స్వాతంత్ర్యానికి అదొక నిజమైన నమూనాగా ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం ఉద్దేశ్యానికి అనుగుణంగాన చాట సభల విధులు, బాధ్యతలను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారుశాసన సభ పరిధిలో అందరూ సమానమైన హక్కులు, బాధ్యతలు ఉన్న సభ్యులుగా మాత్రమే ఉండాలి. సభానాయకుడుగా ఉండే ముఖ్యమంత్రి మొదలు ప్రతిపక్ష నాయకుడు, వివిధ పార్టీల సభాపక్షాల నేతలు, సభ్యులు అందరూ సభాపతి  దృష్టిలో సమానమే. సభలో ఎవరు మాట్లాడినా సభాపతి ద్వారానే మాట్లాడాలి. సభ తనంతట తాను స్వతంత్రమైనది కాదు. రాజ్యాంగ పరిధిలో దేశ సార్వభౌమాధికారానికి అది లోబడి ఉంటుంది. సభలో జరిగే చర్చలు, సభ చేసే తీర్మానాలు, చట్టాలు రాష్ట్ర ప్రజలు వారి తరఫున ఎన్నికైన ప్రతినిధులు ఉమ్మడిగా స్పీకర్ గారికి నివేదిస్తారు. మనం పార్లమెంటరీ విధానాన్ని బ్రిటీష్ పాలనా విధానం నుంచి తీసుకున్నాం.  బ్రిటన్ లో దేశ సార్వభౌమాధికారం రాణి  గారి చేతుల్లో  ఉండేదిబ్రిటీష్ పార్లమెంటు  చర్చించిన విషయాలను, చేసిన తీర్మానాలను సభాపతి ద్వారా సార్వభౌమాదికారికి నివేదించే పధ్ధతి ఉండేది. అట్లా పార్లమెంటు తరఫున సభ అధికార ప్రతినిధిగా మాట్లాడే వ్యక్తిగా సభాపతి ఉండేవాడు. రకంగా ఆయనను స్పీకర్ అన్నారు.

భారతదేశంలో జాతీయ స్తాయిలో రాష్ట్రపతిని, రాష్ట్రాల స్తాయిలో గవర్నర్ వ్యవస్థలను రాజ్యాంగ పరమైన సార్వభౌమాధికార ప్రతీకగా పరిగనిస్తారు. స్పీకర్లు సభా వ్యవహారాలను ప్రధానంగా సభ చేసే తీర్మానాలను, చట్టాలను స్పీకర్ ద్వారా రాజ్యాంగ ప్రతినిధికి నివేదిస్తారు. రకంగా స్పీకర్ స్థానం శాసన సభలో అత్యంత ఉన్నతమైనది, రాజకీయాలకు అతీతమైనదిగౌరవనీయమైనదిగా భావిస్తారు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం, సభలోపల తమ ఆదిపత్యం కోసం, రాజకీయ స్వార్థంతో  స్పీకర్ స్థానాన్ని, స్థానానికున్న హుందాతనాన్ని మలినం చేస్తున్నారు

శాసన సభలో ఎవరెవరి పాత్ర ఏమిటి, సభలో ఎలా ప్రవర్తించాలిఎలా ప్రసంగించాలి మొదలుకుని ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి వరకు అన్నీ భారత రాజ్యాంగం నాలుగో భాగంలో చట్టసభల నిబంధనల్లో ఉంటాయి. సభ్యులు నియమనిబంధనలకు అనుగుణంగానే మసలుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సాంప్రదాయానికి విరుద్ధంగా నడుస్తోంది.  ఇప్పుడు సభలో ముందేన్నదూలేని గందరగోళం నెలకొని ఉన్నది. ఎవరు అధికార పక్షమో ఎవరు ప్రతిపక్షమో తెలియని అయోమయం రాజ్యమేలుతున్నది.   అధికార పక్షం  ప్రతిపక్ష పాత్రను, ప్రతిపక్ష పార్టీ అధికారపక్షం పాత్రనూ పోషిస్తున్నాయి.  శాసన సభ వెలుపల మాత్రమే ఉండాల్సిన రాజకీయ పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలు ఇప్పుడు సభలో ప్రవేశించడంతో సభాపతి చేతులేత్తేయాల్సిన పరిస్థితిని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం

  సంగతిని అధికార కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి  బొత్సా సత్యనారాయణ కూడా సభ ఆవరణలోనే నిర్ధారించినట్టు మీడియా లో వార్తలొచ్చాయి. సభ బయట ఎవరు ఎవరితో లాలూచిపడ్డా పట్టించుకోవాల్సిన పనిలేదు కానీ సభలో ప్రతి[పక్షనేత హోదాలో ఉన్న వ్యక్తి లాలూచిపడడం నిజమే అయితే అది ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే పార్లమెంటరి వ్యవస్థలో ప్రతిపక్షాన్ని ప్రజల గొంతుగా గుర్తిస్తారు. అలా గుర్తించి, ప్రజల తరఫున నిలబడి మాట్లాడమనే సభానాయకుడితో సమానమైన హోదా ప్రతిపక్షనాయకుడికి కూడా కట్టబెట్టారు. అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి అధికార పక్షానికి లాలూచీ పడిపోతే సభలో జరిగే చర్చల్లో, సభ తీసుకునే నిర్ణయాల్లో, చేసే చట్టాల్లో  ప్రజల ఆకాంక్షలు ఎలా ప్రతిబింభిస్తాయి? నిజంగానే అలా లాలూచీ పడాలనుకుంటే సభ వెలుపలే అయన తన తెలుగుదేశం పార్టీని చిరంజీవిలాగా కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రభుత్వంలో భాగం కావచ్చు. అలా చేస్తే సభకు మరో ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకునే అవకాశం కూడా ఇచ్చినట్టవుతుందిఅంతేతప్ప శాసన సభను వంచనకు వేదికగా వాడుకోకూడదు

ఇక అధికార పక్షంలో పరిస్థితి కూడా అయోమయంలోనే ఉన్నది. సభలోపల, వెలుపలా ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి నిర్ణయాలను ఆయన నాయక్ల్మంత్రివర్గ సహచరులే విమర్శించే స్తితిలో ఉన్నారుశాసన సభలో సభ్యులు కూర్చున్న తీరును గమనిస్తే ఎవరెవరు ఎపార్తీలో ఉన్నారో పోల్చుకోవడం కష్టం. చట్టసభలోపల, బయట ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కదివరకు ఎవరిని అనుమతించాలి అనే విషయాల్లోనూ నియమాలున్నాయి. వీటి ప్రకారం ముందు స్పీకర్ కు కుడి వైపున అధికార పక్షం, ఎడమ వైపున ప్రతిపక్షం ఉంటాయి. ముందు వరసలో సభాపక్షం నాయకులు , ఉపనాయకులు కూర్చుంటారు. తరువాతి స్థానాల్లో మంత్రులు, విప్ లు ఉంటారు. సాధారణ సభ్యులు వాళ్ళు ఎన్ని సార్లు సభకు ప్రాతినిధ్యం వహించారన్న సీనియారిటీని బట్టి స్తానాలు కేటాయించాలని నిబంధనలు  చెపుతున్నాయికానీ మన సభలో మాత్రం ముందు వరుసలో మెగా స్టార్ చిరంజీవి కనిపిస్తారు. నిజానికి ఆయన మొదటి సారే గెలిచినందున సాధారణ సభ్యుడిలా చివరి వరుసలలో కూర్చోవాలి. కానీ పదవి లేకున్నా ఆయనకు ముందు వరుస వడ్డించడం విడ్డూరమే! ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఫరవాలేదు. పార్టీ కాంగ్రెస్లో కలిసిపోయాక, ఆయన అనుచరులు కాంగ్రెస్ విప్పులైమంత్రులై పోయాకా, స్వయంగా ఆయన, ఆయన శాసన సభ్యులు కాంగ్రెస్ కండువాలతో సభలో తిరుగుతుంటే ఆయనకు ముందువరుసలో స్థానం  ఇవ్వడం అమర్యాద కిందికే వస్తుంది. ఒకవేళ ఇంకా విలీనం ప్రక్రియ పూర్తికాలేదని దబాయించినా ప్రజారాజ్యం శాసన సభ్యులు కాంగ్రెస్ విప్ లుగా ఎలా ఉంటారు?  అలాగే విలీనం అయిపోయాక కూడా వంగా గీతను పీ ఆర్ పీ విప్ గా ఎలా గుర్తిస్తారు.

ఇదంతా కప్పల తక్కెడను తలపిస్తోంది. ఇక అన్నిటికీ  పరాకాష్ట జగన్ వర్గాన్ని అధికార పక్షం కింద లెక్కేసుకోవడంతాము అధికార పార్టీ కాదని చెప్పేందుకు వారంతా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కండువాలతో సభలోకి వచ్చినా వారిని మాత్రం అధికార పక్షంలోనే కూర్చోబెట్టారు. వారు ఇప్పటికే స్పీకర్ కు రాజీనామాలు ఇచ్చారు. వాటిని విచక్షనాధికారాలు ఉపయోగించి తిరస్కరించారాణే అనుకుందాం.   తరువాత అదే సభ్యులు ప్రభుత్వం మీద తమకు విశ్వాసం లేదని ప్రకటించడంతో పాటు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సభలోనే స్పీకర్ ముందే వోటు వేశారు. వాళ్ళు అధికార పక్షం జారీ చేసిన విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోటు వేశారని అధికార పార్టీ, సభలో పార్టీ విప్ కూడా ఫిర్యాదు చేసారు. వారిని తొలగిన్చావలసిన్డిగా వేడుకున్నారు.  గౌరవ సభ్యులు కూడా అడినిజమేనని ఒప్పుకుంటున్నారు. అయినా వారి సభ్యత్వాలు రాద్దుచేయకుండా  సభలోకి అనుమతించడం, అధికార పక్షం స్థానాల్లో కూర్చోబెట్టడం విస్మయం కలిగించే విషయం

 ఇవన్నీ గమనిస్తున్నవారికి సహజంగానే సభ నిర్వహణ తీరు రాజ్యాంగ పరిధి దాటుతున్నట్టు కనిపిస్తోంది. ఇదంతా స్పీకర్ మీదే ప్రతిఫలిస్తుందిస్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్వయంగా చట్టసభల్లో ఉన్నవాళ్ళు, శాసన సభావ్యవహారాలు గమనిస్తున్నవాళ్ళు అంటున్నారుగతంలో తెలంగాణా శాసన సభ్యుల రాజీనామాల విషయంలో స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. మూకుమ్మడి రాజీనామాలు చెల్లవనడంతో పాటు భావోద్వేగాలను తాను పరిగణలోకి తీసుకోనని బాహాటంగానే చెప్పేశారు. స్పీకర్ ఒక ప్రాంతానికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ సభ్యుల స్వేచ్చను హరిస్తున్నాడని అనేక మంది శాసన సభ్యులు వాపోయారు. నాగం జనార్ధన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి రాజీనామా ఆమోదిమ్పజేసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చిందిఅయినా అది స్పీకర్ విచక్షనాదికారాల్లో భాగమని కొందరు సమర్ధించే ప్రయత్నం చేసారుకానీ ఇప్పుడు వై ఎస్ జగన్ అనుకూల శాసన సభ్యుల విషయంలో ఆయన వ్యవహార శైలి గమనిస్తే విమర్శకుల వాదనే నిజమనిపిస్తోందిఇటీవల భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు  స్పీకర్ వైఖరి ప్రజాస్వామ్యానికి కీడు చేసేవిధంగా ఉందని విమర్శించారు. ఎన్ని విమర్శలు ఉన్నా  స్పీకర్ ధోరణిలో మార్పు కనిపించక పోవడం చూస్తే నిజంగానే అతని వెనుక ఏదో ఒత్తిడి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒత్తిడి రాజ్యాంగ పరమైనది కాదని, పూర్తిగా రాజకీయప్రేరేపితమైనదని పరిణామాలను గమనిస్తే అర్థమౌతుంది.

ఇవన్నీ ఆలోచిస్తే బొత్స సత్యనారాయణ మాటల్లో సత్యమున్నదనిపిస్తోంది. ఇప్పుడు సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కలిసి పోయారనే భావన కలుగుతోంది. అలా లాలూచి పడి పోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి జగన్ రూపంలో కనిపిస్తే రెండోది తెలంగాణా రూపంలో వారిని వెంటాడుతోంది. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా భయపెడుతోన్న  రెండే  ఇద్దరినీ ఒక్కటయ్యేలా చేస్తున్నాయి.   ఇప్పుడు రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ ప్రత్యక్షంగా జగన్ ప్రజాబలం ఏమిటో తెలిసిపోతుంది. జగన్ కనీసం సగం స్థానాల్లో గెలిచినా మిగితా ఇద్దరు చెరో పావు స్థానాలకు పరిమితం కావాల్సి వస్తుంది. ఒకవేళ మొత్తం జగనే గెలిస్తే తమ పరువు పోవడమే కాకుండా, తమతో ఉన్న మిగితా శాసన సభ్యులు ఆలోచనలో పదే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ మనుగడ కష్టమై పోతుంది. అది  మధ్యంతరానికి మార్గం చూపితే గాలిలో సీమాంధ్ర లో తమ ఆచూకీ మిగలకుండా పోతుంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న స్థానాల్లో డిపాజిట్లు కూడారాని వాతావరణం ఉంది. ఒక వైపు తెలంగాణా ఉపఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలోతెలంగాణా అంశం తిరిగి తిరిగి మళ్ళీ శాసన సభకు చేరుకుంది.

సమావేశాల్లో తెలంగాణా తీర్మానం చేయాలని టీ ఆర్ ఎస్ తో సహా మరికొన్ని పార్టీలు పట్టుబడుతున్నాయి.  దేశంలోనే అత్యున్నత విధాన నిర్ణాయక సభగా భావించే పార్లమెంటులో స్వయానా కేంద్ర  హోంమంత్రి చేసిన ప్రకటనకే దిక్కులేకుండా పోయిన నేపధ్యంలో ఇంకా చట్టసభల మీద విశ్వాసం ఉంచడంలో అర్థం లేదని అనిపించవచ్చు. పైగా శాసన సభ తీర్మానం అనేది ఒక అనవసర ప్రహసనంగా కూడా కనిపించవచ్చు. రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ప్రభుత్వాలయితే ఆర్టికల్ లో సూచించినట్టుగా నేరగా పార్లమెంటు తీర్మానం ద్వారా ఇప్పటికే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసే వారు. అలా చేయకపోగా తెలంగాణా ప్రజల సహనానికి నిరంతరం పరీక్షలు పెడుతున్నారు. అయినప్పటికీ ప్రజలు పదే పదే ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల తమ విశ్వాసాన్ని  ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ శాసన సభ వేదిక ద్వారా అదేపని చేయబోతున్నారు. ఇది ఫలితం లేనిదని తెలిసినా ఇప్పుడున్న రాజకీయ అనిశ్చితిని చేధించాలంటే తీర్మానం కోసం పట్టుబట్టడం తప్పనిసరి అని టీ ఆర్ ఎస్ భావిస్తోంది తీర్మానం ద్వారా ఎవరెవరు ఎటువైపో తేలిపోతుంది. సభలో తీర్మానం సందర్భంగా చర్చ జరుగుతుంది. చర్చలో వ్యక్తులుగా కాకుండా పార్టీలుగా అన్ని రాజకీయ పక్షాలు తమ వైఖరిని చెప్పాల్సి ఉంటుందికానీ ఇది సాధ్యమయ్యే పనేనా అన్నది ఇప్పుడున్న ప్రశ్న


అధ్యక్షా
గడిచిన రెండేళ్లుగా స్వార్థ రాజకీయ ఎత్తుగడల వల్ల రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ప్రజాపాలన పూర్తిగా కుంటుబడి పోయిందిఇప్పుడు అదే పరిస్తితి సభలో కూడా కనిపిస్తోంది. ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయ్యింది.  ప్రజల అభిమతాన్ని మన్నించినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం ఉంటాయి. ప్రజాస్వామ్యానికే తలమానికమైన స్థానంలో మీరున్నారు. ప్రజల స్వేచ్చకు, స్వాతంత్ర్యానికి, ఆకాక్షలకు ప్రతిరూపమైన స్థానం అది. రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా మీకు రాజ్యాంగం కల్పించిన  అధికారలాను వినియోగించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థలు రాజకీయ పక్షాలను నడిపించాలి తప్ప రాజకీయాలు రాజ్యాంగ వ్యవస్థల మీద అధికారం చేకాయించాలని చూడకూడదు. ఇప్పుడు రెండవ ప్రయత్నం కనిపిస్తోంది. మీకున్న అధికారాలను ఉపయోగించి మీరు సభా సాంప్రదాయాలను కాపదగలరని అనడంలో ఎలాంటి సందేహం లేదు. శక్తి, స్వాతంత్రం మీకు రాజ్యాంగమే కల్పించింది.  

ఇక రెండోది ఇప్పుడున్న రాజకీయ సక్షోభానికి మూలమైనది తెలంగాణా సమస్య.  అసాధారణ రీతిలో తెలంగాణా ప్రజలు అర్ధ శతాబ్దికి పైగా తమ  స్వరాష్ట్రంకోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో  పోరాడుతున్నారు. ప్రజల మనోభావాలను మన్నించి భారత ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా, మనందరికీ శిరోదార్యమైన భారత రాజ్యాంగానికి లోబడి  తన నిర్ణయాన్ని ప్రకటించి రెండు సంవత్సరాలు దాటిపోయింది మేరకు ఒక తీర్మానం చేయవలసిందిగా మీకొక సూచన కూడా చేసిందిరెండేళ్లుగా మీ నిర్ణయంకోసం అటు పార్లమెంటు, ఇటు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూపులో ఎందరో నిరాశా నిస్పృహలకు లోనయి రాలిపోతున్నారు. రాజకీయ సందిగ్దంలో పరిపాలన సాగదు. అది మీరుకూడా గమనించే వుంటారు.  ఇటువంటి  ప్రతిష్టంభన పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత శాసనకర్తలకు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణా ప్రజలు పార్లమెంటుతో సంబంధం లేకుండా తమమాటే చెల్లుబాటు కావాలని పట్టుపట్టడం లేదు. కేవలం మీ నేతృత్వంలో ఉన్న సభలో తమ ఆకాంక్షను చర్చించే అవకాశం ఇవ్వమని మాత్రమే అడుగుతున్నారు. చర్చ సారాన్ని దేశ సార్వభౌమాధికారానికి నివేదించే ప్రతినిధిగా వ్యవహరించమని వేడుకుంటున్నారు.  అది దేశ పౌరులుగా జన్మతా సంక్రమించిన హక్కు. రాజ్యాంగం ఇచ్చిన అధికారం. . దాన్ని కాపాడే ధర్మకర్తగా మీరొక నిర్ణయం తీసుకోండి. మీ విధిని మీరు రాగద్వేషాలకు అతీతంగా,  త్రికరణ శుద్ధితో నిర్వహించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సభాపతిగా మీరు చరిత్రలో నిలిచిపోతారు