మంగళవారం, అక్టోబర్ 18, 2011

కాంగ్రెస్ లక్ష్యంగానే కార్యాచరణ



ప్రభుత్వోద్యోగులు భద్ర జీవులని చాలామంది అనుకుంటారు. ఉద్యో గం ఉంటే కడుపులో చల్ల కదలకుంటా పనిచేసుకోవచ్చని, నెలతిరిగే సరికి జీతం వస్తుంది కాబట్టి జీవితం ప్రశాంతంగా గడిపేయవచ్చని అనుకుంటారు. ఉద్యోగులకు కేవలం భద్రతతో కూడిన జీవితమేకాదు అంతకు మించిన బాధ్యతలు కూడా ఉంటాయని మనలో చాలా మందిమి గుర్తించం. నిజాని కి ఒక సాధారణ పౌరుడికి ఉండే స్వేచ్ఛ, స్వతంవూతతలో సగం కూడా ఉద్యోగులకు ఉండవు. ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వంలో, పాలకవర్గంలో భాగం. పాలకుల్లో మనకోసం చట్టాలు, అభివృద్ధికి కావాల్సిన పథకాలు రూపొందించే వాళ్ళు, వాటిని అమలు చేసేవాళ్ళు, అవి సరిగా అమలవుతున్నాయో లేదో చూసేవాళ్ళు ఉంటారు. అందులో రాజకీయ వ్యవస్థ ఒక భాగమైతే, ఉద్యోగవర్గం మరో భాగంగా ఉంటుంది.

రాజకీయ వ్యవస్థ చూపిన మార్గంలో ఉద్యోగులు పనిచేసి ప్రజల ఆలనా పాలనా చూస్తారు. ప్రజల అభివృద్ధికి దోహద పడతారు. ప్రభుత్వం తమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోయినా ఆప్రభుత్వం మీద తిరగబడే అధికారమో, అటువంటి పాలకులను గద్దె దించే అవకాశమో ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉంటాయి. ఉద్యోగులు ప్రభుత్వంలో గుండెకాయ లాంటివారు. అధికార యంత్రాంగం లో ఉద్యోగులు పనిచేయకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుంది. కాబట్టే ఒక సామాన్య పౌరుడికి ఉండే బాధ్యతలకంటే వారికి ఎక్కువ బాధ్యతలు, నిబంధనలు ఉంటాయి. ఉద్యోగంలో చేరే ముందే ప్రతి ఉద్యోగి, తన బాధ్యతలు గుర్తించి, నిబంధనల మేరకే పనిచేస్తానని, ప్రభుత్వానికి విధేయతతో ఉంటానని లిఖిత పూర్వకంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టే ఉద్యోగులకు కూడా పౌరులకు ఉండే అన్ని హక్కులూ ఉన్నప్పటికీ వాటిని యథేచ్ఛగా వాడుకునే స్వేచ్ఛ ఉండదు.

అటువంటిది తెలంగాణ ఉద్యోగులు ఆ పాలకు ల మీదనే తిరగబడి చారివూతాత్మకమైన రీతిలో ప్రజల పక్షాన నిలబడ్డారు. రాష్ట్ర సాధనకోసం సాగుతున్న పోరాటం ఇప్పు డు కీలక దశలో ఉన్నదని గుర్తించి తమకున్న హక్కు లు అవకాశాల పరిధిని విస్తరించారు. ఉద్యోగులకు కొన్ని ప్రత్యే క హక్కులు ఉంటాయి. అవి ఆయా వృత్తుల్లో, ఉద్యోగాల్లో ఎదురయ్యే చిక్కులను తొలగించుకోవడానికి తోడ్పడతా యి. వాటిల్లో ముఖ్యమైనది సమ్మె చేసే హక్కు. ఇన్నేళ్ళ మన చరివూతలో ఇలాంటి సందర్భాలు తక్కువ. కానీ తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేసి తమకున్న శక్తినంతా ఉద్యమం కోసం వెచ్చించారు. ఆంధ్రా పాలకుల అన్యాయాలకు, అవహేళనకు గురౌతున్నారో తెలిసిన తరువాత కూడా మౌనం గా ఉండడం మంచిది కాదనుకున్నారు. యాభై ఏళ్లుగా జరిగి న చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలు, కమిషన్ల నివేదికలు ఏవీ అమలు కాలేదు కాబట్టి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడితే తప్ప తమ పరిస్థితిలో మార్పు రాదని గ్రహించారు.

పదేళ్లుగా జరుగుతున్న ప్రత్యక్ష రాజకీయ పోరాటాలు, ప్రజాస్వామ్య ఉద్యమాలను పాలకులు గుర్తించకపోవడం వల్ల ఇప్పటికే వందలాది మంది అమాయక ప్రజలు బలి దానాలు చేస్తుంటే చలించ ని ప్రభుత్వ ఉదాసీనతను తట్టుకోలేక సమ్మె సైరన్ మోగించారు. నిజంగానే ఇది అతిగొప్ప సాహసం. ఇప్పటిదాకా దేశంలో వచ్చిన ఉద్యమాలలో ఎక్క డా అవలంబించని వ్యూహం. తెలంగాణ ఉద్యోగులు ఈ తెగువను ప్రదర్శించే ముందు తమ సమ్మెకు చట్టబద్ధత ఉందని నిరూపించగలిగారు. తెలంగాణ సమాజం విముక్తయితే తప్ప తమకు విముక్తి లేదని, అందుకు రాష్ట్ర ఏర్పాటు మినహా మరో మార్గం లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. 1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమం ఇంతటి చతురత ప్రదర్శించలేకపోయింది. అప్పుడు ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేశా రు. ఇప్పుడు ఒక దశాబ్ద కాలంగా ఉద్యమం సజీవంగా ఏదో ఒక రూపంలో నిరంతరం సాగుతోంది.

సమాజంలోని అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలోకి వివిధ దశల్లో వచ్చిచేరడం వల్ల తెలంగాణ ఉద్యమానికి పరిపూర్ణమైన ప్రజాస్వామిక స్వభావం వచ్చింది. అంతేకాదు ఇవ్వాళ పాలక వర్గాల్లో భాగంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణవాదాన్ని గుర్తించి అందుకు కావాల్సిన హామీని ఇచ్చి వున్నాయి. అలాగే రాష్ట్ర శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వీరంతా ఇప్పటికే ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, కేంద్రం దాన్ని ఆమోదించడం కూడా జరిగిపోయింది. అంటే ఒక రాజకీయ ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం పాలకుల ఆమోదం ఇప్పటికే పొందింది. ఆ పాలక వర్గాలు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడతామని చెప్పి రెండేళ్లు దాటింది. అలాంటి పరిస్థితుల్లో ఆ పాలనా వ్యవస్థలో భాగంగా ఉద్యోగులు మధ్యలో ఆగిపోయిన ఆ ప్రక్రియను గుర్తుచేయడం తమ బాధ్యతగా భావిం చి సమ్మెకు దిగారు.

అయినా..మన సమాజంలో ‘ఉద్యోగులు సమ్మె విరమించాలి’ అని హుకుం జారీ చేసిన వాల్లున్నట్టే, ‘ఎందుకు, ఎలా విరమిస్తారు’? అని ప్రశ్నించే పెద్దలూ పుట్టుకువచ్చారు. అయినా ఇలాంటి వాళ్ళ కోసం ఇప్పటికే ఉద్యమం, ఆ ఉద్యమానికి నేతృత్వం వహించిన స్వామిగౌడ్ ముందస్తుగానే సమాధానం చెప్పి ఉన్నారు. ఉద్యోగులు శాశ్వతంగా సమ్మెలోనే ఉండా లి, శాశ్వతంగా తెలంగాణ ఉద్యమం ఇదే పద్ధతిలో నడవాలని కోరుకోవడాన్ని మించిన వంచన ఇంకోటి ఉండదు.

కానీ పరిణామాలు అందుకు భిన్నంగా మారిపోవడమే ఇవాళ్టి విషాదం. మొదటగా ఈ సమ్మెలో ఉద్యోగుల నాయకత్వంలో ప్రజలు చారివూతాత్మకమై న విజయాన్ని పొందారు. ఇదొక చరిత్ర ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇంత సంఘటిత పోరాట రూపం ఎప్పుడూ వ్యక్తం కాలేదు. అయితే రాజకీయాల్లో ఇటువంటి ద్రోహానికి కూడా చరివూతలో ఎవరూ సాహసం చేయలేదు. ఈ సమ్మె వల్ల రాజకీయ ఐక్యత సాధించాలనుకున్న ఉద్యోగ సంఘాల లక్ష్యం ఇంకా నెరవేరలేదు. ఇది మన రాజకీయ వైఫల్యం. రెండో వైపు సమ్మె వ్యతిరేకవాదం ఒకటి ఇప్పుడు తెరమీదికు వచ్చింది. పాలనా ప్రక్రియలో ఏర్పడ్డ ప్రతిష్టంభనను గుర్తు చేసినందుకు ఆ బాధ్యతను తాము మరిచిపోలేదన్న మాట కూడా చెప్పలేదు సరికదా వారిని వేధించే చర్యలు, వారికి నాయకత్వం వహిస్తోన్న వారి మీద వేటు వేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. సమ్మెను నీరుగార్చి ఉద్యోగులను నిలదీయాలని చూసింది. తద్వారా తెలంగాణ వాదానికి తూట్లు పొడవాలని అనుకుంది. దాదాపు ఐదు వారాలుగా కొనసాగుతోన్న సమ్మె మీద ఉక్కుపాదం మోపడమే కాదు, తెలంగాణ సమా జం నుంచే ఉద్యోగుల మీద కొందరిని తిరుగుబాటు చేసే విధంగా ఉసిగొ ల్పింది.

సింగరేణి సమ్మె విషయంలో కరెంటు సమస్యను, రైతుల ఇక్కట్లను, ఆర్‌టిసి సమ్మె విషయంలో ప్రయాణికుల ఇబ్బందులను, పాఠశాలలు మూసివేసినందు వల్ల విద్యార్థులు వారి భవిష్యత్తును పావులుగా చేసుకుని మొత్తంగా సమ్మె లేకుండా చేయాలని ప్రభుత్వం వేసిన పాచికలన్నీ బాగానే పారినట్టు కనిపిస్తున్నాయి. సమ్మె అంటే యజమానికి, పాలకుడికి, నియంవూతిస్తోన్న వ్యవస్థకు వ్యతిరేకంగా సాగే సామూహిక నిరసన. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రధానంగా చేయాల్సింది ప్రజలకు ఇబ్బంది లేని పాలన, పౌర జీవితం ఎలాంటి సమస్యలు, అవాంతరాలు లేకుండా కొనసాగేలా చూసుకోవడమే పరిపాలన. ఆ పరిపాలనను స్తంభింపజేసి, ప్రభుత్వానికి సమస్యను నివేదించడం సమ్మె ఉద్దేశ్యం. ప్రజాస్వామ్యంలో ఉద్యోగులు, కార్మికులు ఇలాంటి నిరసన తెలియజేసినప్పుడు ఆ ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. అందు కు తాత్కాలికంగా ప్రత్యామ్నాయాలు వెతికి పౌరసేవలు కొనసాగేలా చూస్తా యి. ఈ లోగా సమ్మెలో ఉన్న వారితో చర్చిస్తాయి, సమస్య పరిష్కారానికి మార్గాలు వెతుకుతాయి.

ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడి ప్రభుత్వం ఉద్యోగులను తమలో భాగంగా కాకుండా కేవలం ఒక ప్రాంతపు ప్రజలుగా మాత్ర మే చూసింది. ‘మీరు సమ్మె చేస్తే మీ వాళ్ళే నష్టపోతారు మాకేంటి?’ అనడ మే కాదు,అట్లా నష్టపోయేలా చూసింది. ఆ నష్టాన్ని ఇంకా ప్రత్యక్ష్యంగా ప్రజ ల మీద రుద్దింది. నష్టం జరుగుతోంది ఇక సమ్మె చాలించండి అనే ఒక వర్గా న్ని తయారు చేసింది. ఇది నిజానికి అన్నిటికంటే ఆందోళన కలిగించే విష యం. తమకు నష్టం జరుగుతున్నా సరే సమ్మె చేసే వారిపట్ల సానుభూతితో ఉండడమే ప్రజాస్వామిక లక్షణం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది.

పరిపాలన, ప్రజాస్వామ్యం, పార్లమెంటు అంటే ఏమిటో తెలిసిన ఉద్యోగులకు పరిష్కారం తమ చేతుల్లో లేదని తెలుసు. రాజకీయ సంక్షోభం ఒక్క దానికి పరిష్కారమని, అది పరిష్కరించాల్సిన వాళ్ళు చేతులు ముడుచు కు కూర్చున్నారని కూడా వాళ్లకు ఎప్పుడో అర్థమైపోయింది. ఇవన్నీ తెలిసే ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉద్యమకారులు, సంఘాలు, సంస్థలు, విడివిడిగా ఈ ఆకాంక్ష న్యాయమైనదని నమ్మి పోరాడుతున్న పౌరసమాజం స్పందిస్తాయని భావించారు. నిజానికి రాజకీయ పార్టీల నుంచి ఆ మేరకు హామీలు కూడా పొందారు. జేఏసీలో భాగంగా ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు అలాగే జేఏసీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా సమ్మెకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. సభలు పెట్టారు, మాట్లాడారు. కానీ తీరా ప్రభుత్వం రంగంలోకి దిగే సరికి వాళ్ళ అసలు స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. ఒక రకంగా వీళ్ళంతా ఉద్యోగుల్ని, ప్రజల్ని యుద్ధరంగంలోకి తోసేసి ఇప్పుడు యుద్ధమే తప్పని అంటున్నారు.

ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరిపోవాలని చేసిన ప్రకటన ఉద్యమ ద్రోహానికి పరాకాష్ట. నిజానికి జేఏసీ ఏర్పాటు చేసిన వాళ్ళలో కేసీఆర్‌తో పాటు జానాడ్డి సమాన బాధ్యుడు. అలాగే ఉద్యోగులు సమ్మెకు దిగాలని, సకలజనుల సమ్మె కు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పినవాడు. అధిష్ఠానం తెలంగాణ ప్రకటన చేయకపొతే రాజీనామా చేస్తానని, ఆమరణ దీక్షకు దిగుతానని బీరాలు పలికిన వాడు. ఇవన్నీ నిజమే అనుకుని ఉద్యోగులతో సహా సకలజనులూ సమ్మెకు దిగితే, ఆ సమ్మెను నిరంకుశంగా ప్రభుత్వం అణచివేస్తున్న సందర్భంలో ప్రజలతో ఉండాల్సిన మనిషి, సమ్మె విరమించాలని హుకుం జారీ చేయడం ముమ్మాటికి ద్రోహమే అని మధుయాష్కి లాంటి ఎంపీలు అంటున్నారు. నిజమే అది ద్రోహమే. కానీ ఈ ద్రోహం ఒక్క జానారెడ్డిదేనా? కాంగ్రె స్ పార్టీ ద్రోహి కాదా? అన్న దానికి ఇటు ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డికి, అటు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా చెలామణి అయ్యే యాష్కి గారే చెప్పాలి.

అసలు జానాడ్డికి ద్రోహం చేసే అంత సీన్ ఉందా? అన్నది కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా సరే నమ్మించే శక్తి ఉన్నవాడే ద్రోహం చేయగలుగుతాడు. ఈ సారి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను నమ్మించే సత్తా ఉన్న మనిషి కాంగ్రెస్‌లో కాదు గదా ఏపార్టీలో కూడా పుట్టలేదు. టీఆర్‌ఎస్‌తో మొదలైన ఉద్యమం ఇప్పుడు ప్రజా ఉద్యమమై ఎదిగింది. ఇప్పుడు ఆ ఉద్యమం టీఆర్‌ఎస్ చేతుల్లో కూడా లేదు. అలాంటిది జానాడ్డి ద్రోహం చేశాడని అనడం ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదించడ మే అవుతుంది. అప్పుడైనా యిప్పుడైనా భవిషత్తులో ఇంకెప్పుడైనా సరే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే విలన్ నెంబర్ వన్.ఇప్పుడు టార్గెట్ చేయాల్సిం ది కాంగ్రెస్‌నే. ఆ పార్టీకి అలాంటి అపవూపద రాకుండా కాపాడడం కోసం బహుశా మధుయాష్కి జానాడ్డిని బలిచేయాలని చూస్తుండవచ్చు. అప్పుడు 370 మందిని చంపేసింది కాంగ్రె స్ ప్రభుత్వమే అయినా ప్రలోభాలతో లొంగదీసుకుని చెన్నాడ్డిని ద్రోహిగా చరివూతలో నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 700 మంది బలి దానాల తరువాత జానాడ్డికి ఆ ముద్ర వేయాలని అనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

అయినా కాంగ్రెస్‌లో ద్రోహులను లెక్కబెట్టాల్సి వస్తే వరుస క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ ఉంటారు. ఒకరు ముందు ఇంకొకరు వెనక అంతే తేడా! ఇప్పుడు చివరి దశలో ఉన్న ఉద్యమాన్ని ఏదో ఒక రకంగా అణచివేసి ఎవరూ నోరెత్తకుండా చేసే పనిలో ఆ పార్టీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ లో ముఖ్యమంత్రి, గవర్నర్ జరిపిన చర్చల సారాంశం ఏమి టో ఇప్పుడిప్పుడే తెలిసివస్తోంది. ఉద్యోగుల వ్యవహరిస్తున్న తీరు, సమ్మె విరమణకు, విచ్ఛిన్నానికి చేసి న ప్రయత్నాలు మొదలు రైల్‌రోకోను అడ్డుకున్న తీరు గమనిస్తే ఇక ఈ రాష్ట్రం లో ప్రజాస్వామ్యానికి నూకలు చెల్లినట్టే అనిపిస్తోంది. ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమంపై హఠాత్తుగా ఉక్కుపాదం మోప డం, మాట్లాడే ప్రతి ఒక్కరి గొంతులు నొక్కి జైళ్లలో పెట్టడం ఎమ్జన్సీ నాటి పద్ధతులు. ఆ వ్యూహంలో భాగంగానే కాస్తో కూస్తో చురుకుగా ఉన్న కాంగ్రెస్ నేతలను కూడా అణచివేసి నోరు నొక్కాలని చూస్తోంది. అన్నిటికీ మించి మహిళా ఉద్యమకారులపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మరీ హేయంగా ఉంది.

పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, తెలంగాణ జాగృతి నేత కవిత, ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పోరాడుతున్న విమల లాంటి వారి పట్ల పోలీసులు ప్రవర్తించిన పధ్ధతి దారుణం. రాత్రంతా హైదారాబాద్ రోడ్ల మీద తిప్పి, పలు పోలీ సు స్టేషన్లు మార్చి వేధించిన తీరు చట్టబద్ధమేమో నాకైతే తెలియదు గాని ధర్మబద్ధమైతే కాదు. అలాగే ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రజా సంఘాల నేతలతోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో వ్యవహరించిన పధ్ధతి, పెట్టిన కేసులు రేపటి పరిణామాలకు సంకేతంగానే భావించాలి. ప్రజల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించే బలం తెలంగాణ పేరుతో పదవుల్లో ఉన్న మంత్రులకు ఎలాగూ లేదు. కనీసం వాళ్ళ పార్టీ నేతలను విడిపించుకోగలిగే స్థితిలో కూడా లేనప్పుడు వాళ్ళ అధికారానికి అర్థమే లేదు. మంత్రులుగా ఎలాగూ మాట చెల్లే పరిస్థితి లేదు కాబట్టి కొందరు రాజకీయాల్లోకి రాకముందు వాళ్ళు నేర్చుకున్న విద్యలను రోడ్ల మీద ప్రదర్శిస్తున్నారు.

జై తెలంగాణ అని నినదించిన ఒక యువకుడి మీద నడివీధిలో మంత్రి దానం తన దాదాగిరి ప్రదర్శించారు. విచివూతమేమిటంటే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం కూడా మంత్రికి వర్తించ డం లేదు! ఇప్పటిదాకా సహనంతో అన్ని ప్రజాస్వామిక పద్ధతులను ప్రజలు ఆచరిస్తూ, అవలంబిస్తూ వచ్చారు. దాదాపు నలభై రోజుల సకల జనుల సమ్మె తెలంగాణ ప్రజల సహనానికి చివరి పరీక్ష. అయి నా స్పందించకుండా ఇప్పుడు తెలంగాణలో భయోత్పాతం సృష్టించి ఉద్యమంలో హింసను ఎగదోయాలని ప్రభుత్వం చూస్తున్నట్టు కనిపిస్తోంది. అదే వారి వ్యూహమైతే అందులో ముందుగా ఆహుతయ్యేది కూడా కాంగ్రెసే అని తెలుసుకుంటే మంచిది. ఇది ప్రజల ఆకాంక్షతో ఆడుకోవాలని చూసే అందరికీ వర్తిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి