ఆదివారం, సెప్టెంబర్ 29, 2013

సీమాంధ్ర సిఎంగా మాట్లాడారు


'' రాష్ట్రానికి సిఎం గా ఉన్న వ్యక్తి ఇరు ప్రాంతాలపై మాట్లాడాలి. మాట్లాడిన వాటిలో కూడా అనేక అబద్ధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి చరిత్రమీద అవగాహన లేదు. చరిత్రను వక్రీకరించారు. తప్పుడు గణాంకాలు చెప్పారు. వాస్తవ విరుద్ధమైన అంశాలు మాట్లాడారు. సిఎంకు సొంత వ్యూహం ఉందని తెలుస్తోంది. రెచ్చగొట్టే ధోరణిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సిఎం సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని దిగ్విజయ్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఆయనకు సిఎం గా కొనసాగే అర్హత లేదు. సిఎం వ్యాఖ్యలు జగన్ పార్టీపై తిరుగుబాటు చేసేందుకే అన్నట్లు ఉన్నాయి. సమైక్య ఉద్యమం కొంతవరకే పరిమితమైంది. సిఎం తన స్థాయికంటే దిగజారి మాట్లాడుతున్నారు. లీడర్ గా ఎదగాలని ఆరాటపడుతున్నారు. ఇరు ప్రాంతాల మధ్య సమస్య వచ్చినప్పుడు సిఎం అంపైరా గా ఉండాలి. కానీ ప్రత్యర్థి బ్యాట్ మన్ గా మారాడు. చేతగాని ముఖ్యమంత్రి అని అందరూ అనుకుంటారనే భయంతోనే సిఎం సమైక్యవాదంపై మాట్లాడుతున్నారు''.
https://www.youtube.com/watch?feature=player_embedded&v=GoEKlvC0xcQ#t=1872

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి