శుక్రవారం, జులై 27, 2012

డబుల్ బారెల్ జ'గన్' !



సిరిసిల్ల పరిణామాలు శ్రీలంకను గుర్తుకు తెచ్చాయి. అందుకు ముందుగా తెలంగాణా లిబరేషన్ టైగర్ రహీమున్నీసాకు తెలంగాణా వాదులంతా కృతజ్ఞతలు చెప్పాలి. తెలంగాణా ఆడబిడ్డల తెగువ కళ్ళార చూసే అవకాశం వచ్చినందుకు  వై ఎస్ విజయ అలియాస్ విజయమ్మ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.  వై ఎస్ విజయ సిరిసిల్ల ప్రయాణమైన తీరు , ఆమెకు బాసటగా రాష్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఒక జాత్యహంకార ధోరణిని గుర్తుకు తెచ్చాయి.ఆధోరణి తెలంగాణా ఆత్మాభిమానాన్ని మరోసారి తట్టిలేపింది. ఖచ్చితంగా  రహీమున్నీసా సీమాంధ్ర వితండ వాదులకు వెన్నులో చలి పుట్టించింది. ఇప్పుడు తెలంగాణా ప్రపంచమంతా రహీమున్నీసా త్వరగా కోలుకోవాలని కోరుకుంటోంది. పవిత్ర రంజాన్ మాసంలో ఆమె యావత్ తెలంగాణా యువతకు స్ఫూర్తి ప్రదాత కావాలని ఆశిస్తోంది. శ్రీలంకలో కూడా రహీమున్నీసా లాంటి అనేకమంది యువతీ యువకులు అక్కడి పాలకులను ఉక్కిరి బిక్కిరి చేసారు.

శుక్రవారం, జులై 06, 2012

రాయల తెలంగాణ రాగం వెనుక..?!



ఈసారి నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో తెలంగాణ అంతటా భారీ వానలు కురుస్తాయని వాతావరణశాఖ నెలరోజుల క్రితం సాధికారికంగా ప్రకటించింది. అది నిజమేనన్నట్టు ఆకాశం నిండా మేఘాలు కమ్ముకుని మురిపించింది. వేడి తగ్గింది. మబ్బు లు కమ్ముకున్నాయి. మబ్బులు చూసి ఈసారైనా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని తెలంగాణ రైతులు ఆశ పడ్డారు. కానీ ఆయి టి పూని నెల దాటుతున్నా ఒక్క చినుకు లేదు. మబ్బులు అలాగే ఉన్నాయి. ప్రతిరోజూ నేడో రేపో అన్నట్టు కమ్ముకు వస్తున్నాయి. మనలో ఆశలు ఎన్ను న్నా ఇలా నెలలు గడుస్తున్నా అవి ఇప్పుడిప్పుడే కురిసే అవకాశాలు మాత్రం కనిపించడంలేదు.